క్రిస్మస్‌కు ‘ఇద్దరిలోకం ఒకటే’

రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా నటిస్తున్న క్యూట్ లవ్ స్టోరీ ‘ఇద్దరిలోకం ఒకటే’ డిసెంబర్ 25న విడుదల..

  • Published By: sekhar ,Published On : November 1, 2019 / 05:02 AM IST
క్రిస్మస్‌కు ‘ఇద్దరిలోకం ఒకటే’

రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా నటిస్తున్న క్యూట్ లవ్ స్టోరీ ‘ఇద్దరిలోకం ఒకటే’ డిసెంబర్ 25న విడుదల..

రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా.. దిల్ రాజు సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం: 35గా శిరీష్ నిర్మిస్తున ప్రేమకథా చిత్రం.. ‘ఇద్దరిలోకం ఒకటే’.. (యూ ఆర్ మై హార్ట్ బీట్) జీఆర్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ అండ్ లిరికల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్యూట్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది..

Read Also : కలుద్దాం రండి : చిరు, చరణ్‌లకు ప్రధాని పిలుపు

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ‘ఇద్దరిలోకం ఒకటే’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కెమెరా : సమీర్ రెడ్డి, ఎడిటింగ్ : తమ్మిరాజు, మ్యూజిక్ : మిక్కీ జె.మేయర్, మాటలు : అబ్బూరి రవి, సహ నిర్మాతలు : హర్షిత్ రెడ్డి – బెక్కెం వేణుగోపాల్.