బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఇలియానా… ఫొటోలు వైరల్
దేవదాసు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత టాలీవుడ్ లో సూపర్ హిట్ లు అందుకున్నవిషయం తెలిసిందే. తక్కువ సమయంలో టాలీవుడ్ లో అగ్రకథానాయికగా వెలుగొందింది ఇల్లీ బేబీ. అయితే 2012లో విడుదలైన జులాయి,దేవుడు చేసిన మనుషులు సినిమాల్లో కన్పించిన ఈ గోవా బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు మకాం మార్చింది. 5ఏళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. 2018లో విడుదలైన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో రవితేజ సరసన నటించింది.
ఆ తర్వాత టాలీవుడ్ వైపు చూడకుండా పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టిన ఈ సుందరి అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటది. ప్రస్తుతం తనకు ఇష్టమైన అండమాన్ దీవుల్లో సమ్మర్ వెకేషన్ టూర్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ గోవా బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అండమాన్ దీవుల్లోని అందమైన లొకేషన్లో గల ముంజో ఓసియన్ రిసార్ట్లో సేది తీరిన ఇల్లీ బేబీ…. సముద్రం మిమ్మల్ని పిలుస్తున్నపుడు అంటూ క్యాప్షన్ ఇస్తూ..బీచ్ తీరంలో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ ఫొటోలలో…. ఇలియానా బికినీ ధరించి బీచ్ చుట్టూ తిరుగుతూ కనిపిస్తుంది. ఇలియానా ఫొటోలు కేవలం కొన్ని గంటల్లో 7 లక్షల మందికి పైగా నచ్చాయి.
సరే, క్షమించండి, కానీ నేను తాన్ గా ఉన్నప్పుడు అని ఓ ఫోటో కింద అ అమ్మడు క్యాప్షన్ ఉంచింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు..ఇలియానా చాలా అందంగా ఉందని,ఎవర్ గ్రీన్ బ్యూటీ అని,గార్జియస్ అంటూ,లుకింగ్ హాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వర్క్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ, ఇలియానా చివరిసారిగా జాన్ అబ్రహం తో కలిసి పగల్ పంటి చిత్రంలో కనిపించింది. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చూపించలేదు.