మహేష్ బాబు కథతోనే ‘యానిమల్’.. ఇక్కడ మళ్లీ రీమేక్ చేస్తారా?

మహేష్ బాబు కథతోనే ‘యానిమల్’.. ఇక్కడ మళ్లీ రీమేక్ చేస్తారా?

టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా మారి, తర్వాత అదే సినిమా రీమేక్‌ కబీర్ సింగ్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ రెండు సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్ చేశారు. ‘యానిమల్’ పేరుతో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో సినిమా చేస్తున్నట్లు న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా క్లారిటీ ఇచ్చేశారు.

ఈ సినిమాకు సంబంధించి అనౌన్స్‌మెంట్ టీజర్‌ను కూడా లేటెస్ట్‌గా చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ సినిమాలో ప‌ర‌ణితీ చోప్రా హీరోయిన్‌‌గా నటిస్తుండగా.. అనీల్ క‌పూర్, బాబీ డియోల్ కీల‌క పాత్రలో కనిపించ‌నున్నారు. ఈ సినిమాకు ‘యానిమల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, టీ సిరీస్, మరాద్ కేతాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే మహేష్ బాబుతో ఓ సినిమాకు మొత్తం సెట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగా ఆ సినిమాను ఇంకా సెట్స్ మీదకు ఎక్కించలేదు. ఇప్పుడు తెలుస్తున్న విషయం ప్రకారం ఆ కథే ఇప్పుడు రణ్‌బీర్ కపూర్‌తో తీస్తున్నాడట. మ‌హేష్, చ‌ర‌ణ్‌ల‌తో ప‌లు సంద‌ర్భాల్లో సందీప్ క‌నిపించ‌డంతో ఆయా కాంబోలో సినిమా రాబోతున్నట్లు ఊహాగానాలు గ‌ట్టిగా వినిపించాయి.

అయితే సడెన్‌గా బాలీవుడ్‌లో కబీర్ సింగ్‌తో వచ్చిన క్రేజ్‌తో అక్కడే మరో సినిమాను తియ్యాలని ఫిక్స్ అయినట్లు అర్థం అవుతుంది. అర్జున్ రెడ్డితో బోల్డ్ ప్రెజెంటేష‌న్ ఇచ్చిన సందీప్‌కు బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తుండడంతో మహేష్‌బాబుకు చెప్పిన కథతోనే అక్కడ సినిమా తీసేస్తున్నాడు అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. అయితే మళ్లీ అదే కథను ఇక్కడ రీమేక్ చేస్తాడా? అనే విషయంలో క్లారిటీ లేదు.. .