Jai Bhim : ‘జై భీమ్’ సత్తా.. మరో మూడు అవార్డులు..
నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2022లో ‘జై భీమ్’ ముచ్చటగా మూడు అవార్డులు సాధించింది..
Jai Bhim: తమిళనాడులో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ‘జై భీమ్’ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. గతేడాది నవంబర్ 2 నుండి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్లో ‘జై భీమ్’ స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Jai Bhim : అరుదైన ఘనత సాధించిన సూర్య సినిమా!
సూర్య హీరోగా నటించడంతో పాటు 2 డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద భార్య జ్యోతికతో కలిసి నిర్మించారు. జ్ఞానవేల్ డైరెక్ట్ చేశారు. ‘జై భీమ్’ మూవీకి ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. రాజకన్ను, పార్వతి అనే దంపతుల కథను ఆధారంగా చేసుకుని.. రాజన్న, సినతల్లి క్యారెక్టర్లను తయారు చేశారు దర్శకుడు.
Jai Bheem : ‘జై భీమ్’కు అరుదైన గౌరవం.. గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్
ఇప్పటికే పలు ఫిలిం ఫెస్టివల్స్కి ఎంట్రీ దక్కించుకున్న ఈ సెన్సేషనల్ ఫిలింలోని ఓ సన్నివేశాన్ని ‘జై భీమ్ సీన్ ఎట్ ది అకాడమీ’ పేరుతో ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. ఆ గౌరవం దక్కించుకున్న ఫస్ట్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించిందీ చిత్రం.
Etharkkum Thunindhavan : సూర్య సినిమా పాన్ ఇండియా రిలీజ్!
నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2022లో ‘జై భీమ్’ ముచ్చటగా మూడు అవార్డులు సాధించింది. బెస్ట్ ఫిలిం.. బెస్ట్ యాక్టర్ (సూర్య).. బెస్ట్ యాక్ట్రెస్ (లిజోమోల్ జోస్) అవార్డులు గెలుచుకున్నారు. ఇండియన్ సినిమా ఇంతటి ఘనత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా ద్వారా ‘జై భీమ్’ టీంకి పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.