జాతిరత్నాలు.. ఓటీటీలో రిలీజ్ డేట్ ఫిక్స్

జాతిరత్నాలు.. ఓటీటీలో రిలీజ్ డేట్ ఫిక్స్

Jathiratnaluonprime Premiers April 11

జాతిరత్నాలు.. పేరు వింటేనే నవ్వొచ్చేస్తుంది.. ఇటీవలికాంలో.. అంతగా పాపులర్ అయ్యింది ఈ సినిమా. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుడిని బాగా నవ్వించిన జాతిరత్నాలు విడుదలైన తర్వాత సరిగ్గా నెల రోజులకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి రాబోతుంది. మార్చి 11న రిలీజైన జాతిరత్నాలు సినిమా.. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమేజాన్ ప్రైమ్‌లో రాబోతుంది.

నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లాలు నటించిన ఈ సినిమాని కరోనా భయంతో థియేటర్‌కు వెళ్లి చూడలేని ప్రేక్షకుల కోసం.. ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ మేరకు డేట్ ఫిక్స్ చేసి ప్రకటించింది చిత్రయూనిట్. జాతిరత్నాలు సినిమా ఏప్రిల్‌ 11 నుంచి ప్రసారం కానున్నట్లు వెల్లడించింది అమేజాన్ ప్రైమ్.

నవ్వుకోడానికి గ్యాప్ కూడా లేకుండా పడి పడి నవ్వుకునేలా.. ఒళ్ళు మరిచిపోయి, కుర్చున్న చోట నుంచి ఎగిరెగిరి నవ్వేలా.. నవ్విస్తోన్న జాతిరత్నాలు సినిమాలో మెయిన్‌గా నవీన్ కామెడీ టైమింగ్‌కి ప్రశంసలు అందాయి.

ప్రియదర్శి, రాహుల్ రవీంద్రన్.. హీరోయిన్ ఫరియా ప్రతి ఒక్కరికీ సినిమా తర్వాత పేరొచ్చింది. డైరెక్టర్ అనుదీప్ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకోగా.. కామెడీ సినిమాలు ఆశ్వాదించేవారైతే డోంట్ మిస్.