జూదం ఆడితే జీవితాలు సర్వ నాశనమైపోతాయ్..

ఆది సాయి కుమార్, శ్రద్ధా శ్రీనాధ్ (జెర్సీ ఫేమ్) జంటగా నటిస్తున్న న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా.. 'జోడి'.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : August 29, 2019 / 05:12 AM IST
జూదం ఆడితే జీవితాలు సర్వ నాశనమైపోతాయ్..

ఆది సాయి కుమార్, శ్రద్ధా శ్రీనాధ్ (జెర్సీ ఫేమ్) జంటగా నటిస్తున్న న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా.. ‘జోడి’.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

ఆది సాయి కుమార్, శ్రద్ధా శ్రీనాధ్ (జెర్సీ ఫేమ్) జంటగా నటిస్తున్న న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా.. ‘జోడి’.. శ్రీనివాస్ గుర్రం సమర్పణలో.. భావన క్రియేషన్స్ బ్యానర్‌పై, విశ్వనాధ్ అరిగెల దర్శకత్వంలో.. పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ చెయ్యగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు జోడి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

అర్థరాత్రి పూట ఆది ఒక్కడే కూర్చుని బీర్ తాగడంతో స్టార్ట్ అయిన టీజర్‌లో ఆది తండ్రి నరేష్ బెట్టింగ్‌లు వెయ్యడం, దానివల్ల ప్రాబ్లమ్స్ రావడం, లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా లాంటివన్నీ చూపించారు. కాంచనమాల అనే పేరుకు తగ్గట్టు టచ్ ఫోన్‌ల జెనరేషన్‌లో కూడా పిచ్చి ఫోన్ వాడే హీరోయిన్, ఆమెని పిచ్చిపిచ్చిగా ప్రేమించే హీరో, ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసి, తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనే కాన్సెప్ట్‌తో జోడి రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

Read Also : ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు కంట్రోల్‌లో పెట్టుకోవాలి..

S.V.విశ్వేశ్వర్ ఫోటోగ్రఫీ, ‘నీవే’ ఫణి కళ్యాణ్ ఆర్ఆర్ కూడా బాగున్నాయి. గొల్లపూడి మారుతీరావు, వెన్నెల కిషోర్, సిజ్జు, సత్య, మాధవి, తదితరులు నటిస్తున్న జోడి సెప్టెంబర్ 6న విడుదల కానుంది.