Jr NTR-Prasanth Neel: తారక్, ప్రశాంత్ వైరల్ పిక్.. సెలబ్రేషన్ అసలు రీజన్ ఏంటంటే?

ఒకవైపు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తో, మరో వైపు ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 2 తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టి ఫుల్ జోష్ మీదున్నారు. ఒకరేమో మాస్ డైరెక్టర్ మరొకరేమో ఊరమాస్ హీరో.. ఈ ఇద్దరూ కలస్తేనే రచ్చ మామూలుగా ఉండదు.

Jr NTR-Prasanth Neel: తారక్, ప్రశాంత్ వైరల్ పిక్.. సెలబ్రేషన్ అసలు రీజన్ ఏంటంటే?

Jr Ntr Prasanth Neel

Jr NTR-Prasanth Neel: ఒకవైపు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తో, మరో వైపు ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 2 తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టి ఫుల్ జోష్ మీదున్నారు. ఒకరేమో మాస్ డైరెక్టర్ మరొకరేమో ఊరమాస్ హీరో.. ఈ ఇద్దరూ కలస్తేనే రచ్చ మామూలుగా ఉండదు. అలాంటిది ఫ్యామిలీస్ తో కలిశారంటే ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి? ఇంతకీ వాళ్లు ఎందుకు కలిశారు. ఏ సెలబ్రేషన్ లో కలిశారన్నడిటైల్స్ పై హావే లుక్.

Prashanth Neel: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్.. ప్రశాంత్ లైనప్ అదిరిందంతే!

పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఊరమాస్ హీరో ఎన్టీఆర్ ఇద్దరూ వేరు వేరు సినిమాలతో బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల సునామి సృష్టించారు. వీళ్లిద్దరూ కలిస్తేనే వార్త. అలాంటిది ఇద్దరూ కలిసి ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకున్నారంటే, అందరి చూపు వీళ్ల వైపే మళ్లింది.

Jr NTR: ఇక జాతరే.. ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్న తారక్ మూవీ లైనప్

కింగ్ ఆఫ్ ఎలివేషన్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఎనర్జీ లెవల్ మీద ఫ్యాన్స్ లో చర్చలు నడుస్తున్నాయి. కొరటాల శివ సినిమా తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ పవర్ ఫుల్ పాన్ ఇండియా సినిమా రానుంది. కాని, ఇప్పటి నుంచే వీళ్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి ఊహాగానాలు ఆడియన్స్ లో పెరిగిపోతున్నాయి. దానికి వీళ్ల సెలబ్రేషనే మెయిన్ రీజన్ అయ్యింది.

Ram Charan-Jr NTR: ఆర్ఆర్ఆర్ సాలిడ్ కలెక్షన్స్.. నార్త్‌లో పెరిగిన తారక్-చెర్రీ రేంజ్!

కేజిఎఫ్ 2 ఇండియన్ సినిమా హిస్టరీలో టాప్ 2 ప్లేస్ ఆక్రమించింది. ట్రిపుల్ ఆర్ వెయ్యికోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసి, పాన్ ఇండియా సక్సెస్ సాధించింది. ఆ ఆనందంలో ఈ సెలబ్రేషన్ చేసుకోలేదు. మే 5వ తేదీన అటు ప్రశాంత్ నీల్, ఇటు ఎన్టీఆర్ వెడ్డింగ్ యానివర్సరీ.. యాదృచ్చికంగా ఇద్దరి పెళ్లి రోజు ఒకే రోజు కావడంతో ఫ్యామిలీస్ తో కలసి ఒకే చోట సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మెమరబుల్ సెల్రబేషన్ కు సంబంధించిన ఒక ఫోటోను ఎన్టీఆర్ షేర్ చేయడంతో ఆ ఫోటో క్షణల్లోనే వైరల్ అయ్యింది. పాన్ ఇండియా ఆడియన్స్ మధ్య చర్చకు దారితీసింది.