Jr NTR : ‘మావయ్య గారు’ అంటూ తారక్ ట్వీట్..

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు..

Jr NTR : ‘మావయ్య గారు’ అంటూ తారక్ ట్వీట్..

Chandrababu Naidu

Jr NTR: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కరోనా బారినపడ్డారు. ఆయన కొడుకు నారా లోకేష్‌కు ఒకరోజు ముందు.. సోమవారం నాడు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో లోకేష్ ఐసోలేట్ అయ్యారు. మంగళవారం జనవరి 18, 2022నాడు చంద్రబాబు నాయుడుకి కరోనా సోకింది.

Jagan-Babu : చంద్రబాబుకు కరోనాపై సీఎం జగన్ ట్వీట్

స్వల్పంగా జలుబు కావడంతో.. టెస్ట్ చేయించుకున్నారు బాబు. పరీక్షల్లో పాజిటివ్ రావడంతో.. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన ఇంట్లో ఐసోలేట్ అయ్యారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు.

ఇదిలా ఉంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చంద్రబాబు గురించి చేసిన ట్వీట్ ఇప్పడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారడమే కాక తెగ వైరల్ అవుతోంది. ఇటీవల చంద్రబాబు సతీమణిని దూషించిన విషయంలో నందమూరి కుటుంబసభ్యులంతా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విదేశీ పర్యటనకు వెళ్తూ ఓ వీడియో విడుదల చేసిన ఎన్టీఆర్.. ఆ వీడియోలో ఎక్కడా కూడా చంద్రబాబు పేరు కానీ భువనేశ్వరి పేరు కానీ చెప్పలేదు. దీంతో అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.

కట్ చేస్తే, ఇప్పుడు తారక్ ‘మావయ్య’ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చెయ్యడంతో నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ట్వీట్‌ని స్క్రీన్ షాట్స్ తీసి షేర్ చేస్తున్నారు. ‘మావయ్య నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ తారక్ ట్వీట్ చేసాడు.