K Viswanath Wife passed away : ముగిసిన కె విశ్వనాథ్ సతీమణి అంత్యక్రియలు..

కళామతల్లి ముద్దుబిడ్డ కళాతపస్వి కె విశ్వనాథ్ మరణం తెలుగు సినీ పరిశ్రమను తీవ్రంగా బాధ పెట్టింది. ఇక విశ్వనాథ్ కుటుంబం అయితే ఆయన లేరు అన్న మాట జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ దిగులుతూనే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కూడా కన్నుమూశారు.

K Viswanath Wife passed away : ముగిసిన కె విశ్వనాథ్ సతీమణి అంత్యక్రియలు..

K Viswanath Wife passed away

K Viswanath Wife passed away : కళామతల్లి ముద్దుబిడ్డ కళాతపస్వి కె విశ్వనాథ్ మరణం తెలుగు సినీ పరిశ్రమను తీవ్రంగా బాధ పెట్టింది. ఇక విశ్వనాథ్ కుటుంబం అయితే ఆయన లేరు అన్న మాట జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ దిగులుతూనే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కూడా కన్నుమూశారు. ఆమె మరణం కుటుంబం సభ్యులతో పాటు సినీ పరిశ్రమలోని వ్యక్తులను కూడా కలిచివేసింది. ఫిబ్రవరి 2న విశ్వనాథ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిబ్రవరి 3న ఆయన అంత్యక్రియలు ముగిశాయి. అయితే అదే రోజు విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి అనారోగ్యానికి గురయ్యారు.

K Viswanath Wife passed away : కె విశ్వనాథ్ సతీమణి కన్నుమూత..

విశ్వనాథ్ మరణాన్ని తట్టుకోలేని ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఆమెను కలిసి ధైర్యం చెప్పినప్పటికీ ఆమె మనసు కుదుట పడలేదు. ఇక అప్పటి నుంచి విశ్వనాథ్ గురించి బాధ పడుతూ అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయ్యిన జయలక్ష్మి.. చికిత్స పొందుతూ వస్తున్నారు. కాగా నిన్న (ఫిబ్రవరి 26) సాయంత్రం గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ చనిపోయిన 24 రోజులకే ఆయన సతీమణి కూడా కన్నుమూయడంతో విశ్వనాథ్ కుటుంబంలో తీరని విషాదాన్ని కలుగజేసింది. కె విశ్వనాథ్ – జయలక్ష్మి 75 ఏళ్ళ వైవాహిక జీవితం గడిపారు. భర్త మరణాన్ని తట్టుకోలేక ఆయన వెంటే స్వర్గానికి వెళ్లిపోయిన వారిద్దర్నీ చూసి ఆదర్శ దంపతులు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

కాగా ఆమె అంత్యక్రియలు నేడు నిర్వహించారు. పంజాగుట్ట శ్మశానవాటికలో విశ్వనాథ్ రెండో కొడుకు రవీంద్రనాథ్.. బ్రాహ్మణ సంప్రదాయంలో తన తల్లి జయలక్ష్మికి అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులతో పాటు పరిశ్రమలోని కొందరు వ్యక్తులు కూడా హాజరయ్యారు. కె విశ్వనాథ్ అంత్యక్రియలు కూడా పంజాగుట్ట శ్మశానవాటికలోనే జరిగాయి.