శ్రీదేవి పుస్తకానికి కాజోల్ ముందుమాట
దివంగత అందాల తార శ్రీదేవి జీవిత చరిత్ర.. ‘శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ పుస్తకానికి ముందు మాట రాసిన ప్రముఖ హీరోయిన్ కాజోల్..
దివంగత అందాల తార శ్రీదేవి జీవిత చరిత్ర.. ‘శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ పుస్తకానికి ముందు మాట రాసిన ప్రముఖ హీరోయిన్ కాజోల్..
దివంగత అందాల తార శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. ప్రముఖ రచయిత సత్యార్థ్ నాయక్.. శ్రీదేవి సినీ జీవిత విశేషాలతో ‘శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ అనే పుసక్త రచించారు. శ్రీదేవి చిన్నతనం నుండి స్టార్ హీరోయిన్గా ఎదిగే వరకు ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు ఈ పుసక్తంలో ఉండబోతున్నాయి.
ఈ పుసక్తానికి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ముందు మాట రాయడం విశేషం. ‘ఐకాన్ శ్రీదేవిగారి నటనా జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. ఆమె సినిమాలను చూస్తూ పెరిగాను. నటనలో ఆమె ఒక ఇన్సిస్టిట్యూట్.. ఆమె పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు కాజోల్.
Read Also : వార్ సెన్సార్ పూర్తి – అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్..
పెంగ్విన్ ఇండియా సంస్థ ఈ పుస్తకాలను ప్రచురించనుంది. గతేడాది ఫిబ్రవరి 24వ తేదీన శ్రీదేవి ప్రమాదవశాత్తు కాలు జారి బాత్ టబ్లో పడి మరణించిన సంగతి తెలిసిందే. ‘శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ పుస్తకం కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Honoured and happy to have the opportunity to pen a foreword for a book celebrating the iconic Sridevi. It was my way of paying a personal tribute to India’s first female superstar. Congratulations @BoneyKapoor, the author @SatyarthNayak and the @PenguinIndia team. pic.twitter.com/NBJAjENg9O
— Kajol (@itsKajolD) September 26, 2019