Kangana Ranaut: కొట్టుకొస్తున్న శవాలన్నీ నైజీరియా నదీ ప్రవాహానివే – కంగనా

కంగనా రనౌట్ కొత్త స్టేట్మెంట్లను రిలీజ్ చేసింది. నదుల్లో శవాలు కొట్టుకొస్తున్నాయని పలు మీడియాల్లో జరుగుతున్న ప్రచారం చేస్తుండగా.. కంగనా ఇలా

Kangana Ranaut: కొట్టుకొస్తున్న శవాలన్నీ నైజీరియా నదీ ప్రవాహానివే – కంగనా

kangana-ranaut-

Kangana Ranaut: కంగనా రనౌట్ కొత్త స్టేట్మెంట్లను రిలీజ్ చేసింది. నదుల్లో శవాలు కొట్టుకొస్తున్నాయని పలు మీడియాల్లో జరుగుతున్న ప్రచారం చేస్తుండగా.. కంగనా ఇలా స్పందించింది. ఉత్తరప్రదేశ్, బీహార్ లోని పలు రాష్ట్రాల నుంచి శవాలు గంగానదిలో కొట్టుకొస్తున్నాయని రిపోర్టులు చెప్తున్నాయి. అవన్నీ కొవిడ్ పాజిటివ్ మృతదేహాలు అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాకపోతే దీనిపై ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. రీసెంట్ గా యాక్టర్ చేసిన కామెంట్ ప్రకారం… టెర్రరిజం అనేది ధర్నాల నుంచే సొల్యూషన్ దొరుకుతుందని భావించే వారికి.. సమాధానం చెప్పాల్సి ఉంది. వాళ్లే టెర్రరిజాన్ని వ్యాప్తి చేస్తున్నారు. మీరు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తే వాళ్లే బాధితులు అయిపోతారు. మీరు కేవలం ధర్నాలు మాత్రమే చేస్తే పార్లమెంటును, ఫైవ్ స్టార్ హెటల్స్ ను పేలు్తారు.

View this post on Instagram

A post shared by Kangana Ranaut (@kanganaranaut)


ఇదంతా ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న పరిస్థితుల ప్రభావమే. మీ దేశాన్ని ర్యాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం నుంచి కాపాడుకోవడం ప్రతి దేశ ప్రాథమిక హక్కే. ఇండియా ఈ విషయంలో ఇజ్రాయెల్ కు సపోర్ట్ గా నిలబడుతుంది అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది.

రీసెంట్ గా ఓ వీడియో పోస్టు చేసిన కంగనా.. వైరల్ గా మారుతున్న శవాల ఫొటోలన్నీ నైజీరియా నుంచి ప్రవహిస్తున్న నదిలో కొట్టుకొస్తున్న శవాలేనని చెప్పుకొచ్చింది కంగనా.