Kangana Ranaut: సినిమా కోసం ఆస్తులన్నీ తాకట్టు పెట్టిన స్టార్ బ్యూటీ!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కంగనా స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తుంది. ఇందిరా హయాంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమాను కంగనా తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్తో ఆమె ప్రొడ్యూస్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కంగనా స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తుంది. ఇందిరా హయాంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమాను కంగనా తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్తో ఆమె ప్రొడ్యూస్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Kangana Ranaut : రాజమౌళికి దేశ ధర్మంపై ఉన్న ప్రేమ చూస్తుంటే గర్వంగా ఉంది.. కంగనా!
అయితే ఈ సినిమా కోసం ఆమె చాలా కష్టపడుతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో కంగనా డెంగ్యూ బారిన పడటం.. ఆ తరువాత ఈ సినిమా కోసం ఆమె తన ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన షూటింగ్ను కంగనా పూర్తి చేసినట్లు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టినట్లుగా ఆమె పేర్కొంది.
Kangana Ranaut : మా అక్కపై యాసిడ్ దాడి జరిగింది.. కంగనా రనౌత్!
ఈ సినిమా కోసం తాను శారీరకంగా, మానసికంగా కూడా చాలా కష్టాలను ఎదుర్కొంటున్నట్లుగా ఆమె తెలిపింది. ఇక కంగనా ప్రస్తుత పరిస్థితి గురించి తన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె కోరింది. ఏదేమైనా కంగనా కమిట్మెంట్కు హ్యాట్సాఫ్ అంటున్నారు అభిమానులు.
View this post on Instagram