Kangana Ranaut: మెరిసేదంతా బంగారం కాదు.. రాజ్ కుంద్రా అరెస్టుపై కంగనా!

నటి శిల్పాశెట్టి భర్త, బిజినెస్ మెన్ రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాతో పాటు మరో పదిమందిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు.

Kangana Ranaut: మెరిసేదంతా బంగారం కాదు.. రాజ్ కుంద్రా అరెస్టుపై కంగనా!

Kangana Ranaut

Kangana Ranaut: నటి శిల్పాశెట్టి భర్త, బిజినెస్ మెన్ రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాతో పాటు మరో పదిమందిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో విచారణ జరుపుతున్నారు. కాగా.. బాలీవుడ్ అంతర్గత వ్యవహారాలతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయాలపై కూడా స్పందించే ఫైర్ బ్రాండ్ కంగనా ఈ నీలి చిత్రాల ఆరోపణనలపై కూడా స్పందించారు.

సినిమా పరిశ్రమను గట్టర్ అని పిలుస్తానన్న కంగనా.. ఇక్కడ మెరిసేదంతా బంగారం కాదని కామెంట్స్ చేశారు. తన తదుపరి సినిమా టికు వెడ్స్ షెరులో బాలీవుడ్ లో జరిగే ఇలాంటి విషయాలనే సమాజానికి చూపిస్తానని ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. కాగా.. నీలిచిత్రాల కేసులో కుంద్రాతో సహా 10 మందిని అరెస్టు చేయగా అసలైన సూత్రధారిగా రాజ్ కుంద్రానే అనే సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసు కమిషనర్ హేమంత్ నాగ్రాలే పేర్కొన్నారు.

ఫిబ్రవరి 2021లో ముంబైలో క్రైమ్ బ్రాంచ్‌లో ఈ నీలి చిత్రాలపై కేసు నమోదవగా.. రాజ్ కుంద్రా అనుచరుడి అరెస్టుతో ఈ వ్యవహారం ఇప్పుడు సంచనలమైంది. వెంటవెంటనే అనుచరుడి అనంతరం రాజ్ కుంద్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ముమ్మర విచారణ జరుపుతున్నారు. కాగా.. మరోవైపు ఈ వ్యవహారంలో బాధితులుగా కొందరు బయటకి వస్తున్నట్లుగా బీ టౌన్ వర్గాలలో ముమ్మర చర్చలు జరుగుతున్నాయి.