Karnataka : డ్రగ్స్ కేసు.. పోలీసుల కంటపడకుండా బాత్‌రూమ్ లో దాక్కున్న నటి

పోలీసుల కంటపడకుండా తప్పించుకునేందుకు కర్ణాటకకు చెందిన నటి, వ్యాపారి సోనియా అగర్వాల్ బాత్ రూమ్ లో దాక్కున్నారు.

Karnataka : డ్రగ్స్ కేసు.. పోలీసుల కంటపడకుండా బాత్‌రూమ్ లో దాక్కున్న నటి

Karnataka (2)

Karnataka : మాదకద్రవ్యాల వ్యవహారం కర్ణాటక చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఇప్పటికే ఇద్దరు నటీమణులు డ్రగ్స్ కేసులో దోషులుగా తేలారు. ఇక విచారణ వేగవంతం చేసిన అధికారులు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరులోని వేరువేరు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో నటి, మోడల్, కాస్మొటిక్స్ వ్యాపారం నిర్వహించే సోనియా అగర్వాల్, మరో వ్యాపారవేత్త భరత్, డీజే వచన్ చిన్నప్ప ప్లాట్లలో డ్రగ్స్ బయటపడ్డాయి. ఈ సోదాల్లో సోనియా ఇంట్లో 40 గ్రాముల గంజాయిని గుర్తించారు పోలీసులు. అయితే ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు.

ఓ హోటల్ లో ఉన్నట్లు సమాచారం రావడంతో అదుపులోకి తీసుకునేందుకు వెళ్లారు పోలీసులు. పోలీసుల కళ్లుకప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది నటి.. ఈ సమయంలోనే బాత్ రూంలో దాక్కుంది. ఎట్టకేలకు ఆమెను బయటకు తీసుకొచ్చిన పోలీసులు.. అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. విచారణలో డ్రగ్స్ వ్యాపారులతో సంబంధం ఉన్నట్లుగా సోనియా వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

నైజీరియాకు చెందిన డ్రగ్స్ వ్యాపారి థామస్ తో తాను కాంటాక్ట్ లో ఉన్నట్లు.. పార్టీలకు అతడు డ్రగ్స్ సప్లయ్ చేసేవాడని విచారణలో సోనియా చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. పలువురు రాజకీయ నాయకులు, వారి కుమారులు, శాండిల్ వుడ్ కి చెందిన పలువురు నటీనటులతో సోనియాకు మంచి సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.