Japan Movie : రియల్ స్టోరీతో కార్తీ ‘జపాన్’.. కోట్ల విలువ చేసే బంగారం కొట్టేసి ఎయిడ్స్‌తో చనిపోయిన దొంగ..

కార్తీ నటిస్తున్న కొత్త మూవీ 'జపాన్' ఒక రియల్ స్టోరీతో రాబోతుందట. చెన్నై లోని లలితా జ్యువెలరీ షాప్ లో కోట్ల విలువ చేసే బంగారం కొట్టేసి ఎయిడ్స్‌తో చనిపోయిన ఒక దొంగ..

Japan Movie : రియల్ స్టోరీతో కార్తీ ‘జపాన్’.. కోట్ల విలువ చేసే బంగారం కొట్టేసి ఎయిడ్స్‌తో చనిపోయిన దొంగ..

Karthi Japan Movie is a real story of tamilnadu thief story

Karthi Japan Movie : కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ‘జపాన్’. ఈ క్రేజీ టైటిల్ కి ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే ట్యాగ్ లైన్ పెట్టి ప్రేక్షకుల్లో సినిమా పై ఆసక్తి కలగజేస్తున్నారు. ఇటీవల కార్తీ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. గ్లింప్స్ లో కార్తీ డిఫరెంట్ గెటప్ లో కనిపించడమే కాకుండా సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో కామెడీ చేస్తూ ఆకట్టుకున్నాడు. దీంతో మూవీ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. కాగా ఈ మూవీ గురించి ఇప్పుడు ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

Naga Chaitanya : హిందీ హారర్ మూవీ రీమేక్‌లో అక్కినేని హీరో.. క్లారిటీ ఇచ్చిన చైతన్య టీం!

ఈ సినిమా ఒక రియల్ స్టోరీతో రాబోతుందట. 2019లో చెన్నై (Chennai) లోని లలితా జ్యువెలరీ (Lalithaa Jewellery) షాప్ లో దాదాపు 13 కోట్ల విలువైన బంగార ఆభరణాలు, వజ్రాలను దొంగతనం చేసిన తిరువారూర్ ముర్గన్ అనే వ్యక్తి కథ ఆధారంగా జపాన్ మూవీ తెరకెక్కబోతుందట. ఈ దొంగ తమిళనాడుతో పాటు సౌత్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో అనేక దోపిడీలు పాల్పడ్డాడు. అయితే అతని పోలీసులు పట్టుకున్న తరువాత 2020 లో జైలులో ఎయిడ్స్‌ వలన చనిపోయాడు. ఈ దొంగ కథలో కొన్ని చేంజెస్ చేసి సినిమాగా తీసుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.

Adipurush : ఆదిపురుష్ మూవీతో బాలీవుడ్‌కి భయం పుడుతుందా.. ఎందుకో తెలుసా?

అయితే ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు. కాగా రాజు మురుగన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. పొన్నియిన్ సెల్వన్ సినిమాతో కార్తీకి పాన్ ఇండియా లెవెల్ మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఈ సినిమాకి మంచి మార్కెట్ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా దీపావళికి రిలీజ్ కానుంది.