Kathuri Raja : ధనుష్-ఐశ్వర్యలు మళ్ళీ కలుస్తారు: ధనుష్ తండ్రి

నిన్న ఓ తమిళ న్యూస్ పేపర్ తో ధనుష్-ఐశ్వర్యల విడాకుల గురించి ధనుష్ తండ్రి, ప్రముఖ డైరెక్టర్ కస్తూరి రాజా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ధనుష్, ఐశ్వర్యల మధ్య మనస్పర్ధలు వచ్చాయని.......

Kathuri Raja : ధనుష్-ఐశ్వర్యలు మళ్ళీ కలుస్తారు: ధనుష్ తండ్రి

Dhanush Aishwarya

Dhanush-Aishwarya :  కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రజినీకాంత్ కూతురు ఐశ్వర్య విడిపోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. తమ 18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వీరిద్దరు తెలిపారు. ఈ విడాకులతో వీరిద్దరూ గత మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. అటు కుటుంబ సభ్యులే కాక అభిమానులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తాజాగా వీరి విడాకులపై హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు.

Kaikala Satyanarayana : నాకు అండగా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

నిన్న ఓ తమిళ న్యూస్ పేపర్ తో ధనుష్-ఐశ్వర్యల విడాకుల గురించి ధనుష్ తండ్రి, ప్రముఖ డైరెక్టర్ కస్తూరి రాజా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ధనుష్, ఐశ్వర్యల మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అందుకే వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వారు ఇద్దరూ చెన్నైలో లేరని, ఈ విషయంపై నేను వారితో ఫోన్‌లో మాట్లాడానని, నాతో పాటు ఐశ్వర్య తండ్రి రజినీకాంత్ కూడా విడాకుల విషయంపై మరోసారి ఆలోచించాలని చెప్పారని తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం వారు కలిసి ఉండేదానిపై ఆలోచించాలని చెప్పామన్నారు. వారు చెన్నైకి వచ్చాక నేను, రజినీకాంత్ వారిద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడతామని అన్నారు. త్వరలోనే వారిద్దరు మళ్లీ కలుస్తారని చెప్పారు కస్తూరిరాజా. ధనుష్ తండ్రి ఈ మాట చెప్పడంతో ధనుష్,ఐశ్వర్యలు మళ్లీ కలవాలని కోరుకుంటున్న అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.