కౌన్ బనేగా కరోడ్‌పతిలో ఆమె రూ. కోటి గెలిచింది

  • Published By: vamsi ,Published On : November 6, 2020 / 09:36 PM IST
కౌన్ బనేగా కరోడ్‌పతిలో ఆమె రూ. కోటి గెలిచింది

ప్రముఖ టెలివిజన్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రస్తుతం హిందీలో 12వ సీజన్ జరుపుకుంటుంది. ఈ షో కి ఉన్న ప్రత్యేకత వేరే. వాస్తవానికి ఇది తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో వచ్చినా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో తెలుగులో షోను ఆపేశారు. అయితే హీందీలో అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా సాగుతున్న ఈ షో అత్యధిక టీఆర్‌పీలతో సాగుతుంది.



లేటెస్ట్‌గా ఈ షో లో అమితాబ్ బచ్చన్ ముందు హాట్ సీటులో కూర్చున్న ఢిల్లీకి చెందిన అమ్మాయి రేఖా రాణి రాణించారు. సోనీటీవీలో ప్రసారం అవుతున్న ‘కౌన్ బనేగా క్రోర్‌పతి-12’సీజన్‌లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి మహిళగా నజియా నసీమ్ చరిత్ర సృష్టించారు. ఈ నెల 11వ తేదీన ప్రసారం కాబోతున్న షో ప్రోమోను సోనీటీవీ ట్వీట్ చేయగా.. 35 సెకండ్ల నిడివి గల వీడియోలో ఢిల్లీకి చెందిన కమ్యూనికేషన్ మేనేజర్ నజియా నసీమ్ కోటి రూపాయలు గెలుచుకున్నట్లుగా చూపించారు.



నసీమ్ తెలివితేటలను ప్రశంసించిన అమితాబ్.. గేమ్ గొప్పగా ఆడారని కొనియాడాడు. అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తుండగా, అమితాబ్ ఒక్కసారిగా తన గంభీరమైన గొంతుతో ‘ఏక్ కరోడ్’ అని అనగా.. చప్పట్లు మారుమ్రోగాయి. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు, రంగురంగుల విద్యుద్దీపాల కాంతుల మధ్య నుంచి ఆమెను అభినందిస్తూ రంగుకాగితాలు పై నుంచి నేలకు రాలాయి. నజియా తనను తాను నమ్మలేకపోయారు. కాసేపటి తర్వాత తేరుకోగా.. అమితాబ్ 7 కోట్ల రూపాయల ప్రశ్న అడగడంతో వీడియో ముగుస్తుంది.



కౌన్ బనేగా క్రోర్‌పతి-12 సెప్టెంబరు 28న ప్రారంభం అవగా.. ఈ సీజన్‌లో పలుమార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఈసారి ఆడిషన్స్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. అలాగే, షో చరిత్రలో తొలిసారి ఆడియన్స్ పోల్ లైఫ్‌లైన్‌ను ఎత్తివేశారు. అమితాబ్ బచ్చన్‌కు ఈ ఏడాదితో కేబీసీతో అనుబంధం రెండు దశాబ్దాలు. 2000వ సంవత్సరంలో షోను ప్రారంభించగా, మూడో సీజన్‌లో తప్ప ప్రతి సీజన్‌లోనూ అమితాబ్ హోస్ట్‌గా ఉన్నారు. మూడవ సీజన్‌లో షారూక్ ఖాన్ హోస్ట్‌గా చేశాడు.

 

View this post on Instagram

 

NAZIA NASIM is #KBC12’s first crorepati! Watch this iconic moment in #KBC12 on 11th Nov 9 pm only on Sony TV. @amitabhbachchan @spnstudionext

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on