మెగాస్టార్‌ కు జోడిగా కీర్తి సురేష్‌!

సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన మహానటి సినిమాతో స్టార్ ఇమేజ్‌ సొంతం చేసుకున్న హీరోయిన్‌ కీర్తి సురేష్‌.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 08:10 AM IST
మెగాస్టార్‌ కు జోడిగా కీర్తి సురేష్‌!

సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన మహానటి సినిమాతో స్టార్ ఇమేజ్‌ సొంతం చేసుకున్న హీరోయిన్‌ కీర్తి సురేష్‌.

సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన మహానటి సినిమాతో స్టార్ ఇమేజ్‌ సొంతం చేసుకున్న హీరోయిన్‌ కీర్తి సురేష్‌. ఈ సినిమా తరువాత తెలుగులో ఏ సినిమాకు అంగీకరించని కీర్తి తాజాగా చిరుతో ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఖైదీ నంబర్‌ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా’ నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. 

ఈ సినిమా తరువాత మెగాస్టార్, కొరటాల శివ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఆ సినిమాలో చిరుకు జోడిగా కీర్తి సురేష్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.  అంతేకాదు కీర్తీ సురేష్ తో పాటు మరో హీరోయిన్ గా శృతి హాసన్ అనుకుంటున్నారట. అయితే సినిమా స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసుకొని షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట శివ. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ నుంచి మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also : తెలుసుకోండి : పోలింగ్ బూత్ లోకి వీటికి అనుమతి లేదు