రజనీ కూతురిగా కీర్తి కన్ఫమ్
సూపర్ స్టార్ రజనీకాంత్, సిరుత్తే శివ దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించనున్నట్టు ప్రకటించారు..
సూపర్ స్టార్ రజనీకాంత్, సిరుత్తే శివ దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించనున్నట్టు ప్రకటించారు..
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ తర్వాత సిరుత్తై శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు గతకొద్ది రోజులుగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్ నటి మీనాతో పాటు, రజనీ కూతురుగా కీర్తి సురేశ్ నటించనున్నారని వార్తల వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో తాను నటిస్తున్నట్టు కీర్తి సురేశ్ తాజాగా కన్ఫమ్ చేసింది. ఈ మేరకు ఆమె ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు.
‘నా జర్నీలో అద్భుతమైన మైలురాయికి సంబంధించిన వార్తను మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రజనీ సార్ని కలవడమే గొప్ప అనుభూతి అనుకుంటే.. ఆయనతో కలిసి నటించడం నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన జ్ఞాపకం అవుతోంది’ అని కీర్తి తెలిపింది.
కమెడియన్ సూరి మాత్రం రజనీతో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఈ చిత్రంలో మిగతా నటీనటుల వివరాలను మాత్రం ప్రకటించాల్సి ఉంది. ‘మహానటి’తో జాతీయ అవార్డ్ గెలుచుకున్న కీర్తి, సూపర్స్టార్తో నటించడం విశేషం అనే చెప్పాలి. కీర్తి ప్రస్తుతం తెలుగులో ‘మిస్ ఇండియా’, తమిళంలో ‘పెంగ్విన్’ చిత్రాల్లో నటిస్తుంది. రజనీ, మురగదాస్ డైరెక్షన్లో నటించిన ‘దర్బార్’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 9న విడుదల కానుంది.
Thank you so much. It gives me immense pleasure to work with you once again @sunpictures ??? https://t.co/s1wTlb4ICm
— Keerthy Suresh (@KeerthyOfficial) December 9, 2019