Keerthy Suresh : దసరా యూనిట్‌కి కీర్తి సురేష్ బంగారు కానుకలు..

కీర్తి సురేష్, నేచురల్ స్టార్ నానితో కలిసి 'దసరా' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 90వ కాలం నాటి కథనంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. దీంతో కీర్తి సురేష్ చిత్ర యూనిట్ కి బంగారు కానుకలు ఇచ్చి ఆశ్చర్య పరిచింది అని తెలుస్తుంది.

Keerthy Suresh : దసరా యూనిట్‌కి కీర్తి సురేష్ బంగారు కానుకలు..

Keerthy Suresh

Keerthy Suresh : మహానటి సినిమాతో తరువాత లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి కీర్తి సురేష్ కేర్ అఫ్ అడ్రెస్స్ అయ్యిపోయింది. ఒక పక్క స్టార్ హీరోల పక్కన నటిస్తూ కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరో పక్క ఫిమేల్ లీడింగ్ సినిమాలు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఉన్నాయి. అంతేకాదు స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే సూపర్ స్టార్, మెగా స్టార్ వంటి హీరోలకు చెల్లి గాను నటిస్తుంది. గతంలో మహానటి సావిత్రి ఇలా నటించేది. ఆ మహానటి బాటలోనే ఈ మహానటి కూడా పయనిస్తుంది.

Keerthy Suresh : రివాల్వర్‌ రీటాగా కీర్తిసురేష్‌..

కాగా కీర్తి సురేష్, నేచురల్ స్టార్ నానితో కలిసి ‘దసరా’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 90వ కాలం నాటి కథనంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. దీంతో కీర్తి సురేష్ చిత్ర యూనిట్ కి బంగారు కానుకలు ఇచ్చి ఆశ్చర్య పరిచింది అని తెలుస్తుంది. ఈ సినిమా కోసం పని చేసిన 130 మందికి రెండు గ్రాములు బంగారు కాయిన్స్ ని బహుమతిగా ఇచ్చిందట. ఇందుకోసం కీర్తి దాదాపు 13 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని బహుమతులు అందుకున్న కొంతమంది సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ కీర్తి సురేష్ కి థాంక్యూ చెబుతూ పోస్ట్ లు చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు. సింగరేణి బొగ్గు గ‌నులు నేపథ్యంతో వస్తున్న ఈ మూవీలో నాని రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించబోతున్నాడు. సముద్రఖని, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, మీరా జాస్మిన్, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.