keerthy suresh : షూటింగ్ లో నా పేరు మర్చిపోయి రష్మిక రష్మిక అని పిలిచేవారు

ఈ ఈవెంట్ లో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ నిర్మాతలతో అంతకు ముందే చేయాలి, కానీ కుదరలేదు. ఈ సినిమాతో ఇది కుదిరింది. కళావతిని నాకు బహుమతిగా ఇచ్చినందుకు.........

keerthy suresh : షూటింగ్ లో నా పేరు మర్చిపోయి రష్మిక రష్మిక అని పిలిచేవారు

Keerthy Suresh

Sarkaru Vaari Paata :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

SamudraKhani : మహేష్ గారిని చూస్తే చాలు ఎనర్జీ వస్తుంది

ఈ ఈవెంట్ లో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ నిర్మాతలతో అంతకు ముందే చేయాలి, కానీ కుదరలేదు. ఈ సినిమాతో ఇది కుదిరింది. కళావతిని నాకు బహుమతిగా ఇచ్చినందుకు డైరెక్టర్ పరశురామ్ గారికి థ్యాంక్స్. నన్ను ఈ క్యారెక్టర్ లో తీసుకున్నందుకు డైరెక్టర్ సర్ కి థ్యాంక్స్. ఆయన షూటింగ్ లో నా పేరు మర్చిపోయి రష్మిక రష్మిక అని పిలిచేవారు. ఈ సినిమాకి పని చేసిన వారందరికీ థ్యాంక్యూ. మహేష్ గారితో షూటింగ్ లో ఉన్నప్పుడు ఆయన టైమింగ్ తో, ఆయన అందంతో టెన్షన్. నాకు టెన్షన్ గా ఉన్నా మీకు సెలబ్రేషన్స్. మహేష్ గారితో పని చేయడం నా అదృష్టం. ఆయన విన్నారు. ఆయన ఉన్నారు. ఆయన మీ ముందుకి వస్తున్నారు. మహేష్ గారి రియల్ లైఫ్ కళావతి గారికి చాలా చాలా థ్యాంక్స్. నాకు చాలా సపోర్ట్ చేశారు.