‘మే ఐ కమిన్’ అంటూ దసరాకు రానున్న రాఖీ భాయ్..

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 2’.. దసరా కానుకగా విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : March 13, 2020 / 12:47 PM IST
‘మే ఐ కమిన్’ అంటూ దసరాకు రానున్న రాఖీ భాయ్..

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 2’.. దసరా కానుకగా విడుదల కానుంది..

‘మే ఐ కమిన్’.. అంటూ బాక్సాఫీస్‌పై దండయాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు రాఖీ భాయ్.. సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించి, బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల వసూళ్లు సాధించి, యావత్ సినీ ప్రపంచం కన్నడ పరిశ్రమవైపు చూసేలా చేసిన  సినిమా.. ‘కే.జి.ఎఫ్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘K.G.F. CHAPTER 2’ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ‘రాకింగ్ స్టార్’ యశ్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, అనంత్‌నాగ్‌, మాళవిక అవినాష్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమా విడుదల తేది శుక్రవారం ప్రకటించారు.

దసరా కానుకగా 2020 అక్టోబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా.. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ కానుంది ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 2’.. తెలుగులో వారాహి చలనచిత్రం సాయి కొర్రపాటి రిలీజ్ చేయనున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటోందీ చిత్రం.