ఏపీలో రూ.200కోట్లతో సినిమా స్టూడియో

  • Published By: vamsi ,Published On : March 21, 2019 / 02:54 AM IST
ఏపీలో రూ.200కోట్లతో సినిమా స్టూడియో

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని బాపట్లలో రూ.200 కోట్లతో అత్యాధునిక సినీ స్టూడియోను నిర్మిస్తున్నట్లు సినిమా రచయిత కోన వెంకట్ వెల్లడించారు. స్థానిక కోన భవన్‌కు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు అవసరమైన ప్రకృతి నిర్మాణం బాపట్లలో ఉందని, అత్యున్నత స్థాయిలో సినిమాలను నిర్మించేందుకు అవసరమైన స్టూడియోను నిర్మిస్తే వేలాది మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు.
Read Also : అరవకండి.. ఓటేయండి.. సీఎం కాదు.. పీఎం కూడా అవుతాడు

సహజ వనరులను వాడకుని ఇక్కడ అద్భుతమైన సినిమాలను రూపొందిచవచ్చునని ఆయన తెలిపారు. కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఈ స్టూడియో ద్వారా అవకాశాలు వస్తాయని, బాపట్లకే వన్నె తెచ్చేలా స్టూడియో నిర్మాణం ఉంటుందని, బహుముఖ ప్రజ్ఞాశాలి కోన ప్రభాకరరావు స్ఫూర్తితో రాష్ట్రం గర్వించేలా కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్టూడియో నిర్మాణం చేపట్టనున్నట్లు కోన స్పష్టం చేశారు.

బాపట్లకు మెరుగైన రవాణా సౌకర్యం ఉందని, దీనికి దగ్గర్లోనే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉందన్నారు. అలాగే బాపట్ల అసెంబ్లీ స్థానానికి వైపిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ కుటుంబ సభ్యుడు కోన రఘుపతిని గెలిపించాలంటూ ఆయన ప్రజలను కోరారు. 
Read Also : పోసానికి ఈసీ నోటీసులు.. ఆసుపత్రిలో చేరానంటూ లేఖ