చిరు, చరణ్లను డైరెక్ట్ చేయడం బ్లెస్సింగ్..
Koratala Siva: మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం..‘ఆచార్య’.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ ‘ఆచార్య’ షూటింగ్ ఇటీవలే పున:ప్రారంభమైంది.
ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల మాట్లాడుతూ.. చిరంజీవి గారితో సినిమా అంటే ఏ డైరెక్టర్కైనా ఫ్యాన్ బాయ్ మూమెంట్.. చిన్నప్పటినుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాం.. అలాంటిది ఆయనకు యాక్షన్.. కెమెరా.. రోలింగ్.. చెప్పడం అనేది మాటల్లో చెప్పలేని మర్చిపోలేని జ్ఞాపకం.. చిరంజీవి గారితో పాటు బోనస్గా రామ్ చరణ్ను కూడా డైరెక్ట్ చేయడం ఒక బ్లెస్సింగ్లా భావిస్తున్నాను.. ఇద్దరి ఒకే ఫ్రేమ్లో చూడ్డానికి మీ అందరికంటే ముందుగా నేను చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.. అని చెప్పుకొచ్చారు శివ.