గ్రీన్ ఇండియా ఛాలెంజ్- మొక్కలు నాటిన సుస్మిత, మంచు లక్ష్మీ..
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరం మొక్కలు నాటాలని నటి మంచు లక్ష్మీ అన్నారు. ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరిస్తూ ఫిలింనగర్లోని తన నివాసంలో తన కూతురు నిర్వహణతో కలిసి మొక్కలు నాటారామె. తను శ్రీగంధం మొక్క నాటుతున్నాని, ఈ మొక్కలు నాటే కార్యక్రమం తనకి, తన నాన్న మోహన్ బాబు గారికి ఎంతో ఇష్టం అన్నారు.
అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరూ స్వీకరిస్తూ మొక్కలు నాటాలని తెలుపుతూ ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. డిజైనర్ నీరజ కోన, నటి, డ్యాన్సర్ సంధ్య రాజు, నటుడు సందీప్ కిషన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని మంచు లక్ష్మీ పిలుపునిచ్చారు.
ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరిస్తూ మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల భర్త విష్ణు ప్రసాద్తో కలిసి తన నివాసంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సుస్మిత అన్నారు. తన సోదరి శ్రీజ, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, నిర్మాత అశ్వినీదత్ కుమార్తె, నిర్మాత స్వప్న దత్ తదితరులను గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు నామినేట్ చేశారు సుస్మిత.