రియాకు లక్ష్మీ, తాప్సీ సపోర్ట్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్..

  • Published By: sekhar ,Published On : August 31, 2020 / 11:30 AM IST
రియాకు లక్ష్మీ, తాప్సీ సపోర్ట్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్..

#JusticeForSushantSinghRajput: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో.. అతని మాజీ ప్రేయసి రియా చక్రవర్తిని అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య ఘటనలో ఆమె హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భంలో టాలీవుడ్ నటి, మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి, తాప్సీ పన్ను రియాకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మీ చేసిన ట్వీట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. సుశాంత్ మృతి కేసులో రియా చక్రవర్తిని ఇటీవల రాజ్‌దీప్ సర్దేశాయి ఇంటర్యూ చేశారు.



ఆ ఇంటర్వ్యూ చూసిన మంచు లక్ష్మి.. ‘‘సుశాంత్‌కు న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని, కానీ రియా చక్రవర్తిని ఇలా దూషించడం, విమర్శల పాలు చేయడం సరికాదని అన్నారు. ఆమెకు అండగా నిలవాలని, ఈ దూషణలు ఆపాలని కోరారు. ఈ మెసేజ్‌తోపాటుగా ఇండస్ట్రీ మిత్రులు ఇప్పటికైనా మేలుకోవాలని, ఈ దూషణలు ఆపాలని #JusticeForSushantSinghRajput, #JusticeForRheaChakraborty’’ హ్యాష్ ట్యాగ్‌లతో లక్ష్మీ ట్వీట్ చేశారు.
https://10tv.in/sushant-was-being-given-banned-drugs-without-his-knowledge-family-lawyer-on-rhea-chakrabortys-drug-chats/
‘గొప్పగా చెప్పావ్’ అంటూ రాజ్‌దీప్ రిప్లై ఇచ్చారు. లక్ష్మీ చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చనిపోయిన సుశాంత్‌కు అండగా ఉండకుండా రియాకు మద్దతు ఇవ్వడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.



అలాగే తాప్సీ కూడా రియాకు మద్దతుగా ట్వీట్ చేశారు.‘‘నాకు వ్య‌క్తిగ‌తంగా సుశాంత్ పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు, రియా కూడా అంత‌గా తెలీదు. తెలిసింద‌ల్లా ఒక్క‌టే.. నేరం నిరూపణ కాకముందే ఓ వ్య‌క్తిని దోషిగా నిల‌బ‌ట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం త‌ప్పు. చ‌ట్టాన్ని ప్ర‌తి ఒక్క‌రూ విశ్వ‌సించండి గౌరవించండి’’ అని ట్వీట్ చేశారు తాప్సీ.