Tarakaratna : తారకరత్న మరణాన్ని దాచిపెట్టారు.. లక్ష్మీ పార్వతి!
తారకరత్న మరణం పై లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేసింది. తారకరత్న గుండెపోటు వచ్చిన రోజునే మరణించాడు. కానీ..
Tarakaratna : గత కొంత కాలంగా తెలుగు సినీపరిశ్రమలోని పలువురు ప్రముఖులు స్వర్గస్థులు అవుతూ వస్తున్నారు. తాజాగా నటుడు నందమూరి హీరో తారకరత్న కన్నుమూశారు. ఆయన అకాల మరణంతో సినీ పరిశ్రమతో పాటు ఏపీ రాజకీయాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరమవుతూ వస్తున్న తారకరత్న రాజకీయాల్లో యాక్టీవ్ అవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గత నెలలో టీడీపీ లీడర్ నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకి హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పం హాస్పిటల్ కి తరలించారు.
Vijayasai Reddy : ఆ బాధ్యత నాది- విజయసాయిరెడ్డికి మాటిచ్చిన బాలకృష్ణ
అప్పటికే ఆయన గుండె ఆగిపోయింది అంటూ వైద్యులు గుర్తించగా, సిపిఆర్ చేసి తారకరత్నకి తిరిగి ప్రాణం తెప్పించినట్లు వెల్లడించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లకి తరలించగా.. 22 రోజులుగా చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే ఈ శనివారం (ఫిబ్రవరి 19) పరిస్థితి విషమించడంతో తారకరత్న కన్నుమూశారు. ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి తారకరత్న మరణం పై సంచలన కామెంట్స్ చేసింది. “తారకరత్న గుండెపోటు వచ్చిన రోజునే మరణించాడు. కానీ పాదయాత్ర మొదలుపెట్టిన రోజునే ఇటువంటి ఘటన జరిగింది అంటే, లోకేష్ కి మరియు పాదయాత్రకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని ఇన్నాళ్లు దాచి పెట్టారు. ఇన్నిరోజులు తారకరత్న భార్య, పిల్లలు ఎంత బాధ పడి ఉంటారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి నిన్న సాయంత్రం నుంచి ఆహారం తీసుకోక పోవడంతో నీరసించి పోయిందని, ఆమెను హాస్పిటల్ కి తరలించే యోచనలో కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం.