‘దశ-దిశ’ను ‘అల..’ కాపీ కొట్టారు- త్రివిక్రమ్కి లీగల్ నోటీసులు?
తన కథను కాపీ కొట్టి ‘అల..వైకుంఠపురములో’ సిినిమా తీశారని త్రివిక్రమ్పై ఆరోపణలు చేస్తున్న కృష్ణ..
తన కథను కాపీ కొట్టి ‘అల..వైకుంఠపురములో’ సిినిమా తీశారని త్రివిక్రమ్పై ఆరోపణలు చేస్తున్న కృష్ణ..
మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ తన కథను కాపీ కొట్టి ‘అల..వైకుంఠపురములో’ సినిమా తీశారని కృష్ణ అనే దర్శకుడు ఆరోపిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘అల వైకుంఠపురములో’..
సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై హైయ్యెస్ట్ కలెక్షన్లతో నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా విడుదలై 6వ వారంలోకి ఎంటర్ అయినా బన్నీ ఇంకా తన సన్నిహితులకు సక్సెస్ పార్టీలు ఇస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు కాపీ ఆరోపణలు ఎదుర్కుంటోంది. అసలు విషయం ఏంటంటే.. కృష్ణ అనే దర్శకుడి దగ్గర నుండి త్రివిక్రమ్ కథను కాపీ కొట్టాడని అందుకనే సదరు దర్శకుడు త్రివిక్రమ్కి లీగల్ నోటీసులు ఇవ్వాలనుకుంటున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త రంగులరాట్నంలా తిరుగుతోంది.
కృష్ణ 2013లోనే ఈ కథను ఫిలించాంబర్లో రిజిష్టర్ చేయించాడట. అయితే స్క్రిప్ట్ ఫస్ట్ పేజీని డైరెక్టర్ త్రివిక్రమ్కి ఇచ్చాడట.. తను ‘దశ-దిశ’ పేరుతో సినిమా తీయాలనుకుంటుండగా ఇంతలో త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ సినిమా తీశాడని కృష్ణ ఆరోపిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అల.. టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా త్రివిక్రమ్ ఇంగ్లీష్ సినిమాలో సీన్స్ కాపీ చేస్తాడని, నితిన్ ‘అఆ’ సినిమా కూడా సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘మీనా’ సినిమాకు కాపీ అంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Read More>>ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేలా మా పిల్లలకు కూడా నేర్పిస్తాం