M M Keeravani : RGV నా మొదటి ఆస్కార్ అంటున్న కీరవాణి.. చచ్చిన వాళ్లనే ఇలా పొగుడుతారు అంటున్న వర్మ!

ఆస్కార్ (Oscar) గెలుచుకున్న కీరవాణి (M M Keeravani) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వర్మ (Ram Gopal Varma) తన మొదటి ఆస్కార్ అని చెప్పగా, వర్మ రియాక్ట్ అవుతూ.. చచ్చిన వాళ్లనే ఇలా పొగుడుతారు అంటూ ట్వీట్ చేశాడు.

M M Keeravani : RGV నా మొదటి ఆస్కార్ అంటున్న కీరవాణి.. చచ్చిన వాళ్లనే ఇలా పొగుడుతారు అంటున్న వర్మ!

M M Keeravani says his first oscar was ram gopal varma

M M Keeravani : ఎం ఎం కీరవాణి (M M Keeravani) తన స్వరాలతో భక్తిని పుట్టించగలడు, రక్తిని కలిగించగలడు. తన గానంతో భావోద్వేగానికి గురిచేయగలడు, హుషారుని రప్పించగలడు. 1987 లో కె చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన కీరవాణి.. 1990 లో మొదటి సినిమాకి స్వరాలూ అందించే అవకాశం అందుకున్నారు. అయితే ఆ సినిమా రిలీజ్ కాకపోవడంతో, తనకి కూడా గుర్తింపు రాలేదు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ 1991 లో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన ‘క్షణం క్షణం’ సినిమా అవకాశం రావడంతో కీరవాణి మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు.

Naatu Naatu : టెస్లా కారుల ‘నాటు నాటు’ ఆటకి ఎలాన్ మస్క్ రిప్లై.. RRR రేంజ్ మాములుగా లేదుగా!

అప్పుడు మొదలైన కీరవాణి ప్రయాణం నేడు ఆస్కార్ (Oscar) అందుకునే స్థాయి వరకు చేరుకుంది. నాటు నాటు (Naatu Naatu) సాంగ్ కి ఆస్కార్ అందుకోవడంతో ఇటీవల ఒక బాలీవుడ్ మీడియాకి కీరవాణి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో కీరవాణి మాట్లాడుతూ.. నాకు ఇది రెండో ఆస్కార్. నేను గెలుచుకున్న తొలి ఆస్కార్ రామ్ గోపాల్ వర్మ. కెరీర్ మొదటిలో చాలామంది దగ్గరికి వెళ్లి నేను చేసిన సంగీతం వినమని క్యాసెట్ లు ఇచ్చేవాడిని. కానీ వాటిని వినకుండానే వాళ్ళు చెత్త బుట్టలో వేసేవాళ్ళు.

RRR : RRR ప్రభంజనానికి ఏడాది.. ఊహకి అందని అవార్డులు.. లెక్కకి మించిన రివార్డులు..

అయినా ఇండస్ట్రీకి ఒక కొత్త వ్యక్తి వచ్చి తన సంగీతం వినమంటే ఎవరు మాత్రం వింటారు. అయితే ఆ సమయంలో రామ గోపాల్ వర్మ నాకు ఛాన్స్ ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ ఛాన్స్ ఇచ్చాడు అంటే మనం తనతో పని చేద్దాం అని నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. రామ్ గోపాల్ వర్మ కెరీర్ లో శివ ఆస్కార్ రోల్ ప్లే చేస్తే, నా కెరీర్ లో రామ్ గోపాల్ వర్మ ఆస్కార్ రోల్ ప్లే చేశారు. కాబట్టి నా మొదటి ఆస్కార్ రామ్ గోపాల్ వర్మ అని చెప్పుకొచ్చాడు. ఇక దీనికి వర్మ రియాక్ట్ అవుతూ.. ”హే కీరవాణి నాకు చనిపోయిన భావన కలుగుతుంది. ఎందుకంటే, చచ్చిన వాళ్లనే ఇలా పొగుడుతారు” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.