MAA Elections 2021 : ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలపై కౌంటర్లు వేసిన ‘మా’ ఎన్నికల అధికారి

'మా' ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినా కూడా వివాదాలు ఆగట్లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు ఆపట్లేదు. ఎన్నికలు జరిగిన

MAA Elections 2021 : ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలపై కౌంటర్లు వేసిన ‘మా’ ఎన్నికల అధికారి

Maa

MAA Elections 2021 :  ‘మా’ ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినా కూడా వివాదాలు ఆగట్లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు ఆపట్లేదు. ఎన్నికలు జరిగిన తీరుపై ప్రకాశ్‌ రాజ్‌, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు మీడియా ముందు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతే కాక ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన వాళ్లంతా రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి కౌంటింగ్ సందర్భంగా అవకతవకలు జరిగాయని అన్నారు. ప్యానల్ సభ్యులు మాట్లాడుతూ.. ఎన్నికల అధికారి బ్యాలెట్ పేపర్స్ ఇంటికి తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. యాంకర్ అనసూయ మాట్లాడుతూ ముందు రోజు గెలిచామని చెప్పి తర్వాతి రోజు ఓడిపోయాను అని చెప్పారు. అసలు ఇది ఎలా సాధ్యం అంటూ ప్రశ్నిస్తూ పోలింగ్‌ జరిగిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది.

Bunny Vasu : ఇండస్ట్రీలో కూడా తప్పులున్నాయి : బన్నీ వాసు

తాజాగా ఈ ఆరోపణలపై ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ స్పందించారు. ఎన్నికల అధికారి మీడియాతో మాట్లాడుతూ.. నేను చాలా సార్లు ‘మా’ ఎన్నికలు నిర్వహించాను. ఎన్నికలు నిర్వహించడం నాకు కొత్తేమి కాదు. అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదు, తాము అధికారికంగా అనౌన్స్ చేయకముందే ఆమె గెలిచినట్టు మీడియాలో ప్రచారం జరిగింది. అది ‘మా’ తప్పు కాదు అని వ్యాఖ్యానించారు. బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లానని చేసిన ఆరోపణలను ఖండించి నేను బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లలేదు. ఆ పేపర్స్ ఉంచిన బాక్స్‌ల తాళాలను మాత్రమే నేను ఇంటికి తీసుకెళ్లానని, అది నా బాధ్యత అని కృష్ణమోహన్ తెలిపారు.