మాధురీ దీక్షిత్ 45 రోజుల సమ్మర్ క్యాంప్
అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాధురీ పాట వస్తుందంటే ఆడియన్స్ కుర్చీలకు అతుక్కుపోవాల్సిందే. డ్యాన్స్ చేసే టాలెంట్, స్కిల్స్ ఉండే వారిని ప్రోత్సహించేందుకు మాధురీ 45 రోజుల సమ్మర్ క్యాంప్ను ఏర్పాటు చేసింది. డ్యాన్స్ విత్ మాధురీ (డీఎండబ్ల్యూ) ఇవాళ ప్రారంభమైంది.
ఆసక్తి గల అభ్యర్థులు తమ డ్యాన్స్ వీడియోలను డీఎండబ్ల్యూ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. యూజర్ ఓటింగ్ ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఈ కాంపిటీషన్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 10 మంది అభ్యర్థులకు మాధురీతో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం కల్పించనుంది. విజేతకు డీఎండబ్ల్యూ డ్యాన్స్ చాంప్ 2020 ట్రోపీని అందజేయనున్నారు.
డీఎండబ్ల్యూ త్వరలో..అంటూ వీడియోను మాధురీ ఇన్స్టాలో షేర్ చేసింది. సమ్మర్ క్యాంపులు తన జీవితంలో చాలా ముఖ్యమైనవని, ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకుంటానని మాధురీ పోస్ట్ లో పేర్కొంది.