గర్వంగా ఉంది.. కన్నీళ్లొస్తున్నాయి.. మహేష్ ఎమోషనల్ ట్వీట్..

  • Published By: sekhar ,Published On : August 17, 2020 / 12:52 PM IST
గర్వంగా ఉంది.. కన్నీళ్లొస్తున్నాయి.. మహేష్ ఎమోషనల్ ట్వీట్..

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోని శ‌నివారం త‌న రిటైర్‌మెంట్‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ క్రికెట్‌కు ధోని చేసిన సేవ‌ల‌ను గుర్తుకు తెచ్చుకుంటూ ఆయ‌న భ‌విష్య‌త్ బావుండాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులు ఆశిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారంతా ధోని ఇండియన్ క్రికెట్‌కు తెచ్చిపెట్టిన ఘనత మరువలేనిది అంటూ ట్వీట్లు చేస్తున్నారు.



ఈ క్ర‌మంలో టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్ ద్వారా త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. ‘‘2011లో ఇండియాను క్రికెట్‌ విశ్వ‌విజేత‌గా నిలిపిన ఆ ఐకానిక్ సిక్స‌ర్‌ను నేను ఎలా మ‌ర‌చిపోగ‌ల‌ను!! నేను ఆ స‌మ‌యంలో వాంఖడే స్టేడియంలోనే నిలుచున్నాను. గ‌ర్వంగా ఉంది. క‌న్నీళ్లు వ‌స్తున్నాయి. క్రికెట్ ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. టేక్ ఎ బౌ ఎం.ఎస్‌.ధోని’’ అంటూ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ట్వీట్ చేశారు.