చాలా కాలం వెయిట్ చేశాం – న్యాయ‌వాదుల‌కు నా సెల్యూట్‌

నిర్భయ నిందితుల ఉరి గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్..

  • Published By: sekhar ,Published On : March 20, 2020 / 12:34 PM IST
చాలా కాలం వెయిట్ చేశాం – న్యాయ‌వాదుల‌కు నా సెల్యూట్‌

నిర్భయ నిందితుల ఉరి గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్..

ఎనిమిదేళ్ళ పోరాటం తర్వాత నిర్భయ నిందుతులకు ఉరి శిక్ష పడింది. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులు ( ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌) తీహార్ జైలులో ఉరి వేశారు. ఈ సందర్భంగా భారతదేశ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ స్పందన తెలిచేస్తున్నారు.

రవితేజ, శ్రద్ధా కపూర్, తమన్నా, ప్రీతి జింటా, రితేష్ దేశ్‌ముఖ్, రవీనా టాండన్, కార్తి, మంచు లక్ష్మీ ప్రసన్న, కేథరిన్, అనసూయ భరద్వాజ్, నాగశౌర్య వంటి  సినీ పరిశ్రకు చెందిన పలువురు ట్విట్టర్ ద్వారా తమ స్పందన తెలియచేశారు. లేటు అయినా న్యాయమే గెలిచిందని వారంతా అభిప్రాయ పడ్డారు.

ఈ ఘటనపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందిస్తూ : ‘‘చాలా కాలం వెయిట్ చేశాం. న్యాయం జ‌రిగింది. నిర్భ‌య ఘ‌ట‌న‌పై ఇప్పుడు జ‌రిగిన విష‌యం న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచింది. ఎంతో న‌మ్మ‌కంతో అలు పెరుగని పోరాటం చేసిన నిర్భ‌య త‌ల్లిదండ్రుల‌కు, న్యాయ‌వాదుల‌కు సెల్యూట్‌. ఇలాంటి దురాగ‌తాల‌కు స‌త్వ‌ర న్యాయం ద‌క్కాలి, బ‌ల‌మైన చ‌ట్టాలుండాలి’’ అని ట్వీట్ చేశారు.