Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్‌కు షాక్.. సినిమా ఇప్పట్లో లేనట్టే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్...

Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్‌కు షాక్.. సినిమా ఇప్పట్లో లేనట్టే..?

Mahesh Babu Rajamouli Movie To Go On Floors Next Year

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమని మహేష్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమాపై మహేష్ బాబు కూడా ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

Sarkaru Vaari Paata: పంచులతో పిచ్చెక్కించనున్న మహేష్!

ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రాజమౌళి, మహేష్ రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. రాజమౌళి మహేష్ బాబు మూవీ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇంకా స్క్రిప్టు పనులు పూర్తి కాలేదని, జక్కన్న ఈ సినిమా స్క్రిప్టు పనులకు మరింత సమయం తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమాను పట్టాలెక్కించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Mahesh Babu : హిందీలో కూడా రిలీజ్ చేయాల్సింది.. సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ అంటున్న సెన్సార్ బోర్డు మెంబర్..

కానీ ఇప్పుడు ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో జక్కన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను పక్కాగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. అయితే మహేష్ మాత్రం ఈ గ్యాప్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఏదేమైనా రాజమౌళితో మహేష్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశను కలిగించే విషయమని చెప్పాలి. ఇక ఈ సినిమా అడవి నేపథ్యంలో సాగే కథతో రాబోతున్నట్లు ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా వచ్చే మార్చిలోనైనా పట్టాలెక్కుతుందా లేదా అనేది చూడాలి.