వారు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోతారు..

గాల్వన్ వ్యాలీలో వీరమరణం పొందిన జవానులు ఎప్పటికీ మన గుండెల్లోనే నిలిచిపోతారు : మహేష్ బాబు

  • Published By: sekhar ,Published On : June 17, 2020 / 07:51 AM IST
వారు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోతారు..

గాల్వన్ వ్యాలీలో వీరమరణం పొందిన జవానులు ఎప్పటికీ మన గుండెల్లోనే నిలిచిపోతారు : మహేష్ బాబు

నిన్న లడ‌క్‌లోని గాల్వన్ వ్యాలీ లోయ ప్రాంతంలో భార‌త్‌- చైనా ఆర్మీ మ‌ధ్య తలెత్తిన ఘ‌ర్ష‌ణ‌లు హింసాత్మ‌కంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘ‌ర్ష‌ణ‌లో భార‌త సైనికుల్లో కొందరు గాయాలపాలవ్వగా మరికొందరు మ‌ర‌ణించారు. దేశాన్ని కాపాడే క్ర‌మంలో గాల్వ‌న్ లోయ‌లో ప్రాణ త్యాగం దేసిన భార‌త సైనికుల‌కు సెల్యూట్ చేస్తూ, అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియచేస్తూ పలువురు ప్రజలు, ప్రముఖులు మరణించిన వీరజవానులకు వారి కుటుంబాలకు నివాళులు అర్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవానులకు సోషల్ మీడియా వేదికగా సామాన్యులు, సెలబ్రిటీలు నివాళులర్పిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, వీరజవానులకు నివాళులు అర్పిస్తూ ఓ పోస్ట్ చేశారు. ‘గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో అశువులు బాసిన వీరజవానులు ఎప్పటికీ మన అందరి గుండెల్లో నిలిచిపోతారు, దేశం కోసం వారు చేసిన ఈ త్యాగం ఎంతో గొప్పది, అలానే వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అంటూ మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు.