Mahesh Babu: సర్కారువారి పాట రేటు పెంచిన తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సర్కారువారి పాట సినిమా టికెట్ ధరలను పెంచుకోవచ్చని చెప్పింది. సర్కారువారిపాట చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
Mahesh Babu: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సర్కారువారి పాట సినిమా టికెట్ ధరలను పెంచుకోవచ్చని చెప్పింది. సర్కారువారిపాట చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
మల్టీఫ్లెక్స్లు, సింగిల్ స్క్రిన్ థియేటర్లలో రూ.50, ఎయిర్ కండీషన్ సాధారణ థియేటర్లలో రూ.30 పెంచుతున్నట్లు తెలిపింది. మే 12 నుంచి 7 రోజులపాటు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతోపాటుగా సర్కారువారిపాట అదనపు షోలకు కూడా అనుమతులు ఇచ్చింది.
ఇదిలా ఉంటే, తాజాగా మహేష్ బాబు అభిమానులకు ఓ బహిరంగ లేఖను రాశారు. ఆ లేఖలో ‘సర్కారు వారి పాట అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతుంది. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు’ అని లేఖలో వెల్లడించాడు.