Sarkaru Vaari Paata : సినిమా రిలీజ్ అయ్యాక మహేష్.. డైరెక్టర్ పరశురామ్‌కి ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా??

సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఇటీవల డైరెక్టర్ పరశురామ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి మహేష్ ఏం అన్నారు, ఫోన్ చేసి ఏం చెప్పారో తెలిపారు.

Sarkaru Vaari Paata : సినిమా రిలీజ్ అయ్యాక మహేష్.. డైరెక్టర్ పరశురామ్‌కి ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా??

Mahesh

Director Parasuraam :  మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల రిలీజ్ అయి మంచి విజయాన్ని నమోదు చేసింది. రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. సినిమా విజయంపై ఇప్పటికే పలువురు మహేష్, డైరెక్టర్, చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియచేస్తున్నారు.

Kangana Ranaut : ఆ స్టార్ హీరోలు నా సినిమాని ప్రమోట్ చేయరు.. నాకు ఎక్కువ పేరు వస్తుందని ఫీల్ అవుతారు..

సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఇటీవల డైరెక్టర్ పరశురామ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి మహేష్ ఏం అన్నారు, ఫోన్ చేసి ఏం చెప్పారో తెలిపారు. పరశురామ్ మాట్లాడుతూ.. ”మ‌హేశ్ బాబు గారు సినిమా రిలీజ్ అయిన రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు నాకు ఫోన్ చేశారు. సినిమా బాగుందని అందరూ ఆయనకి చెప్పారన్నారు. సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పారు. ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఊహించ‌ని విధంగా నాకు శుభాకాంక్ష‌లు చెప్పారు. నాకు ఇలాంటి స‌క్సెస్ అవసరం. ఆయ‌న చెప్పిన శుభాకాంక్ష‌లు నాకు చాలా చాలా ముఖ్యం. అదే రోజు రాత్రి మేమంతా సక్సెస్ పార్టీలో క‌లిశాం. మ‌హేశ్ బాబు చిన్న‌పిల్లాడిలా మారిపోయి ప్రతి క్ష‌ణాన్ని ఎంజాయ్ చేశారు. ఈ స‌క్సెస్‌తో మేం రెండేళ్లుగా ప‌డ్డ కష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం దక్కింది” అని తెలిపారు.