మహేష్ మైనపు బొమ్మ ఆవిష్కరణ
టాలీవుడ్ ప్రిన్స్ ‘మహేష్ బాబు’ మైనపు విగ్రహం ఆవిష్కరితమైంది. కొండాపూర్లోని AMB సినిమాస్ మల్టిప్లెక్స్ ఇందుకు వేదిక అయ్యింది. ‘మేడమ్ టుస్సాడ్స్’ (సింగపూర్) మ్యూజియం నిర్వాహకులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొదటగా మహేష్ ఫ్యాన్స్ కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులు..అనంతరం సింగపూర్కు మైనపు విగ్రహాన్ని తరలించనున్నారు.
విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల చాలా ఆనందంగా ఉందని..ఇందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియచేశారు మహేష్. ఈ సందర్భంగా ఫ్యాన్స్తో మహేష్ సెల్ఫీ దిగారు. మైనపు బొమ్మ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్యాన్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఇందులో ఆషిక్ విన్నర్గా నిలిచారు.
అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మహేష్ సమాధానం ఇచ్చారు. మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం తమ కుటుంబం ఎంతో ఆనందం వ్యక్తం చేసిందని..శ్రీమంతుడు ఇతర సినిమాలో లుక్స్ ఆధారంగా విగ్రహం తయారు చేసినట్లు మహేష్ చెప్పారు. విగ్రహాన్ని తరలించడం మేడమ్ టుస్సాడ్స్ చరిత్రలోనే మొదటిసారి. ఈ కార్యక్రమంలో మహేశ్తో పాటు కుటుంబ సభ్యులు, మ్యూజియం ప్రతినిధులు, సన్నిహితులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.