Sarkaru Vaari Paata: ఆ ఒక్కదాని కోసం పది రోజులు కష్టపడ్డ మహేష్!
మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మేనియాతో టాలీవుడ్ బాక్సాఫీస్ ఊగిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్....
Sarkaru Vaari Paata: మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మేనియాతో టాలీవుడ్ బాక్సాఫీస్ ఊగిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ కావడంతో, ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్తో సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండగా, పక్కా కమర్షియల్ అంశాలతో పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా సర్కారు వారి పాట ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఈ సినిమావైపు చూస్తున్నారు.
Sarkaru Vaari Paata: యూఎస్లో దుమ్ములేపుతున్న సర్కారు వారి పాట!
ఇక ఈ సినిమా ప్రమోషన్స్లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా మారింది. ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ యాక్షన్ సీన్ గురించి ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్లు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో మహేష్ బాబు మరోసారి పూర్తి మాస్ అవతారం ఎత్తాడని.. ఇక ఆయన చేసిన హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని వారు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం మహేష్ బాబు ఏకంగా 10 రోజుల పాటు కష్టపడ్డాడని వారు తెలిపారు.
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మాస్ ట్రీట్.. మరికొన్ని గంటలే టైమ్!
బీచ్లో జరిగే ఫైట్ సీక్వెన్స్లో మహేష్ బాబు అల్టిమేట్ యాక్షన్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడని వారు చెప్పుకొచ్చారు. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ను ఏకంగా 10 రోజులు జరిపినట్లు వారు పేర్కొన్నారు. తొలుత ఈ యాక్షన్ సీక్వెన్స్ను వైజాగ్ ఆర్కె బీచ్లో చేయాలని చూసినా.. పది రోజుల పాటు అక్కడికి వచ్చే మహేష్ అభిమానులను, జనాన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుందని భావించి, రామోజీ ఫిలిం సిటీలోనే ఓ భారీ బీచ్ సెట్ వేసి, అక్కడ ఈ యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కించినట్లు ఫైట్ మాస్టర్లు తెలిపారు. ఇక ఈ సినిమాకు ఈ ఫైట్ సీక్వెన్స్ మేజర్ అట్రాక్షన్గా మారుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహేష్ చాలా రోజుల తరువాత మాస్ అవతారమెత్తి ఈ సినిమా చేయడంతో, సర్కారు వారి పాట చిత్రం ఖచ్చితంగా పోకిరి రికార్డులను తిరిగిరాస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.