Mahesh Babu : పోలీసులను ఆశ్రయించిన మహేష్బాబు సోదరి
సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి, యంగ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పోలీసులకి ఈ కేసు విషయంలో ఫిర్యాదు చేసింది. శిల్ప తన దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసిందంటూ.......
Mahesh Babu : ఇటీవల అధిక వడ్డి ఇప్పిస్తానంటూ కొంతమంది టాలీవుడ్ ప్రముఖులతో పాటు నగరానికి చెందిన కొంతమంది వ్యాపార వేత్తలను మోసం చేసింది శిల్పా చౌదరి. ఈమె దాదాపు 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు చాలామందిని మోసం చేసింది. దివ్య రెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల విచారణ అనంతరం శిల్పతో పాటు ఆమె భర్తను గత శనివారం అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. పోలీసుల రిమాండ్ లో వారిద్దరిని విచారణ చేశారు. రియల్ ఎస్టెట్ వ్యాపారం పేరుతో శిల్ప చాలా మందిని మోసం చేసిందని పోలీసులు వెల్లడించారు. ఆమె చేతిలో మోసపోయిన వాళ్ళు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయమని పోలీసులు తెలిపారు.
Ticket Price: సినిమా టికెట్ల పెంపుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఈ కేసు వెలుగులోకి వచ్చిన 5 రోజుల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి, యంగ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పోలీసులకి ఈ కేసు విషయంలో ఫిర్యాదు చేసింది. శిల్ప తన దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసిందంటూ నిన్న ప్రియదర్శని పోలీసులను ఆశ్రయించారు. శిల్ప తన వద్ద 2.9 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు ఆమె మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసమే ఆమె ప్రతి వీకెండ్లో కిట్టి పార్టీ ఏర్పాటు చేసేదని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం శిల్పను డబ్బులు ఎక్కడికి తరలించారనే దానిపై విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.