Sarkaru Vaari Paata: మహేష్ నోట సీఎం జగన్ మాట.. పొలిటికల్ డైలాగ్‌కి లవ్ ఎఫెక్ట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. పరుశురాం పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా.. ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో..

Sarkaru Vaari Paata: మహేష్ నోట సీఎం జగన్ మాట.. పొలిటికల్ డైలాగ్‌కి లవ్ ఎఫెక్ట్!

Sarkaru Vaari Paata (1)

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. పరుశురాం పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా.. ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండటంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ నుండి టీజర్లు, పాటలు ఈ సినిమాలోని పాటలు అంచనాలను రెట్టింపు కాగా తాజాగా మేకర్స్ ట్రయిల్ కూడా రిలీజ్ చేశారు.

Sarkaru Vaari Paata: నేను విన్నాను.. నేను ఉన్నాను.. మహేష్ మార్క్ ట్రైలర్!

సమ్మర్ ట్రీట్‌గా రాబోతున్న ఈ సినిమాను మే 12న రిలీజ్ చేయనుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ పెంచేసిన ఎస్వీపీ టీం ఈరోజు సోమవారం సాయంత్రం 04.05 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేసింది. 105 షాట్స్ కాంబినేష‌న్‌లో ‘సర్కారు వారి పాట’ ట్రైల‌ర్ అంద‌రినీ అల‌రిస్తుంది. ఒక వైపు మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే క‌మ‌ర్షియ‌ల్ అంశాలు కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. మాస్‌ను మెప్పించేలా పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ మోత మోగిపోగా ఒక్క డైలాగ్ మాత్రం అభిమానులతో పాటు ప్రేక్షకులలో చర్చకు దారి తీసింది.

Sarkaru Vaari Paata: ఇయర్‌ఫోన్స్, సబ్‌వూఫర్స్ పేలిపోతాయని హెచ్చరిస్తున్న థమన్

నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ ట్రైలర్ లో మహేష్.. కీర్తితో చెప్పిన డైలాగ్ హిలేరియస్ గా పేలింది. ఈ డైలాగ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఎన్నికల ప్రచారంలో ఎన్నో సార్లు విన్న తెలుగు ప్రజలు ఇలా మహేష్ నోట వినడంతో ఆశ్చర్యపోతున్నారు. మహేష్ చెప్పిన ఈ డైలాగ్ తోనే ట్రైలర్ అదిరిపోయింది. పొలిటికల్ డైలాగ్ కి లవ్ ఎఫెక్ట్ ఇచ్చిన పరుశురాం మహేష్ నోట ఈ డైలాగ్ చెప్పించడం ట్రైలర్ కి హైలెట్ గా మారింది. ఇక సినిమాలో ఈ డైలాగ్, ఈ సీన్ ఎలా ఉంటుందో చూడాలి.