Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..

మేజర్ సినిమాకి అడివి శేష్ మరో అడుగు ముందుకేసి మా టికెట్ రేట్లు ఇంతే. టికెట్ రేట్లు పెంచట్లేదు. మాకు డబ్బుల కంటే కూడా ఇలాంటి గొప్ప వ్యక్తి జీవిత కథ............

Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..

Major

Major :  26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ మేజర్‌ సందీప్‌ కృష్ణన్‌ జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ ‘మేజర్‌’. అడివి శేష్‌ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో పాన్‌ ఇండియన్‌ మూవీగా మహేష్ బాబు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా హీరో అడివి శేష్‌ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్‌ చెప్పి కొత్తగా సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.

 

ఇటీవల కరోనా తర్వాత పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు భారీగా పెంచిన సంగతి తెలిసిందే. కొన్ని డబ్బింగ్ సినిమాలకి కూడా థియేటర్ టికెట్ రేట్లు పెంచారు. దీంతో కలెక్షన్స్ రావడం పక్కన పెడితే జనాలు కొన్ని సినిమాలని పట్టించుకోలేదు కూడా. దీంతో టికెట్ రేట్లు పెంచడంపై వ్యతిరేకత, థియేటర్ కి జనాలు రాకపోవడంతో టాలీవుడ్ వర్గాలకు అర్థమయి ఇప్పుడు వచ్చే సినిమాలకి టికెట్ రేట్లు పెంచే సాహసం చేయట్లేదు. ఇటీవల వచ్చిన F3 సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచలేదు అని దిల్ రాజు సరికొత్త ప్రమోషన్ తో జనాల్ని థియేటర్ కి రప్పించడానికి ప్రయత్నించాడు.

ఇక మేజర్ సినిమాకి అడివి శేష్ మరో అడుగు ముందుకేసి మా టికెట్ రేట్లు ఇంతే. టికెట్ రేట్లు పెంచట్లేదు. మాకు డబ్బుల కంటే కూడా ఇలాంటి గొప్ప వ్యక్తి జీవిత కథ ప్రజలకు దగ్గరవ్వడం ముఖ్యం అంటూ ఏపీ, తెలంగాణ రేట్లను పోస్టర్ పై ప్రదర్శించి మరీ ప్రమోట్ చేస్తున్నాడు. అందరికి టికెట్ రేట్లు అందుబాటులో ఉండేలా, అన్ని సినిమాలకంటే తక్కువ రేటు ఉండేలా చూసుకున్నాం అంటూ అడివి శేష్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నాడు. అడివి శేష్ చెప్పిన లెక్కల ప్రకారం సింగిల్‌ స్క్రీన్‌: తెలంగాణలో రూ.150 కాగా, ఏపీలో రూ. 147గా ఉన్నాయి. మల్టీప్లెక్స్‌: తెలంగాణలో రూ.195 కాగా ఏపీలో రూ.177గా ఉన్నాయి. ఈ టికెట్ రేట్లు కూడా అధికారికంగా పోస్ట్ చేసాడు శేష్.

NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి

ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాను పది రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా ఉన్న 9 ప్రధాన నగరాల్లో రోజుకొక చోట ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి ఈ ప్రివ్యూలు వేస్తుండగా వీటికి మంచి స్పందన లభిస్తుంది. జూన్ 3 నుంచి మజార్ సినిమా ప్రేక్షకులందర్నీ థియేటర్లలో పలకరించనుంది ఈ సినిమా.