Manchu Lakshmi : నెటిజన్లపై సీరియస్ అయిన మంచు లక్ష్మి..

ఈ ట్వీట్ లో 'మంచు విష్ణు ప్రపంచం మొత్తాన్ని మార్చడానికి' అని ట్వీట్ చేయడంతో నెటిజన్లు 'మా' అధ్యక్షుడు ప్రపంచం మొత్తం ఎలా చేంజ్ చేస్తాడు అని ట్రోల్ చేస్తున్నారు. నిన్నటి నుంచి సోషల్

Manchu Lakshmi : నెటిజన్లపై సీరియస్ అయిన మంచు లక్ష్మి..

Manchu Lakshmi

Manchu Lakshmi :  మంచు ఫ్యామిలీని సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే స్పీచ్ లు, వీడియోలు, వాళ్ళ మాటలు, ట్వీట్స్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు. దీంతో సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీని బాగా ట్రోల్ చేస్తారు. మొన్న ‘మా’ ఎలక్షన్స్ టైంలో కూడా మంచు విష్ణు ని బాగా ట్రోల్ చేశారు. తాజాగా నిన్నటి నుంచి మంచు లక్ష్మిని ట్రోల్ చేస్తున్నారు.

నిన్న ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై మంచు లక్ష్మి విష్ణుని ఉద్దేశించి ట్వీట్ చేసింది. ‘ఈరోజు మా కుటుంబానికి అత్యంత శుభదినం. నా సోదరుడు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ప్రపంచాన్ని మార్చడానికి ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించనున్న కొత్త ప్రయాణానికి ఆల్‌ ది బెస్ట్‌. నాకెంతో గర్వంగా ఉంది. నువ్వు ఎలాంటి మార్పులు చేయబోతావో అని వేచి చూస్తున్నాను’ అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ లో ‘మంచు విష్ణు ప్రపంచం మొత్తాన్ని మార్చడానికి’ అని ట్వీట్ చేయడంతో నెటిజన్లు ‘మా’ అధ్యక్షుడు ప్రపంచం మొత్తం ఎలా చేంజ్ చేస్తాడు అని ట్రోల్ చేస్తున్నారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ ట్వీట్ దానికి సంబంధించిన ట్రోల్స్ వైరల్ అయ్యాయి.

Pelli Sandadi : వివాదంలో ‘పెళ్లి సందD’ హీరోయిన్.. తను నా కూతురు కాదంటూ..

ఇవాళ ఆ ట్రోల్ల్స్ కి సంబంధించి మంచు లక్ష్మి గట్టిగానే సమాధానం ఇచ్చింది. ‘ఇక ఆపండి. ఎప్పుడు ఛాన్స్‌ వస్తుందా? ఎవర్ని కామెంట్‌ చేద్దామా? అని చూస్తుంటారు. నటీనటులకు సినిమానే ఓ ప్రపంచం కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు అనుకునేలా ప్రపంచాన్ని మార్చడం కాదు, ‘మా’ అసోసియేషన్‌ ప్రపంచాన్ని మార్చడం. ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోండి’ అని తనపై వస్తున్న ట్రోల్స్ కి ధీటుగా ట్వీట్ చేసింది.