Meelo Evaru koteeswarulu : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో ఎవరు మీలో కోటీశ్వరులు స్పెషల్ ఎపిసోడ్

వీకెండ్ ఎపిసోడ్ కి ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకొస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం తెలుగులో తమన్, దేవి శ్రీ ప్రసాద్ లు ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. వీళ్లిద్దరి మధ్య పోటీ

Meelo Evaru koteeswarulu : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో ఎవరు మీలో కోటీశ్వరులు స్పెషల్ ఎపిసోడ్

Mek

Meelo Evaru koteeswarulu :  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి మంచి రెస్పాండ్ వస్తుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా అంతకుముందే బిగ్ బాస్ లో అదరగొట్టారు. ఇప్పుడు మళ్ళీ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రాంతో జనాల్ని అలరిస్తున్నారు. ఇక ఈ షోకి వీకెండ్స్ లో స్పెషల్ గెస్టులని తీసుకొస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే ఈ షోకి రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ, సమంతలు వచ్చారు. మహేష్ బాబు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వీకెండ్ ఎపిసోడ్స్ కి మంచి స్పందన వస్తుంది. దీంతో ప్రతి వారం ఒక గెస్ట్ ని కచ్చితంగా తీసుకొస్తున్నారు.

Kandikonda : చావు బతుకుల మధ్య హాస్పిటల్ లో గేయ రచయిత.. ఆదుకునేవారు లేరా??

తాజాగా మరో వీకెండ్ ఎపిసోడ్ కి ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకొస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం తెలుగులో తమన్, దేవి శ్రీ ప్రసాద్ లు ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. వీళ్లిద్దరి మధ్య పోటీ నడుస్తుంది. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకి చాలా వరకు వీళ్ళిద్దరే సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దర్నీ ఎన్టీఆర్ ఒకే వేదికపైకి తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రాంకి వీకెండ్ గెస్ట్ లుగా దేవి శ్రీ ప్రసాద్ ని, తమన్ ని తీసుకొస్తున్నారు. ఈ విషయం తమన్ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. నా స్నేహితుడు దేవితో కలిసి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కి గెస్ట్ గా వచ్చాము. చాలా ఎంజాయ్ చేశాము. చివర్లో ఎమోషనల్ కూడా అయ్యాము. తారక్ అన్నకి నా ప్రేమని తెలియచేస్తున్నాను. ఈ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని ట్వీట్ చేశారు. అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.