మెగా స్వాగతం.. అభిమానుల కోలాహలం..

మెగా స్వాగతం.. అభిమానుల కోలాహలం..

Mega Fans: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’.. ఈ సినిమాలో కొంత పార్ట్ షూటింగ్ తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో జరుగనుంది. అక్కడకు వెళ్లేందుకు ఆదివారం చిరు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు.

Acharya

మెగాస్టార్ వస్తున్నారనే వార్త తెలియగానే పెద్ద ఎత్తున మెగాభిమానులు విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడికి ఘన స్వాగతం పలికారు. ఈలలు, అరుపులతో సందడి చేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఏజెన్సీ ప్రాంతానికి రోడ్డు మార్గంలో చిరంజీవి బయలుదేరారు. అభిమానులకు అభివాదం చేస్తూ షూటింగ్ స్పాట్‌కు ర్యాలీగా తరలివెళ్లారు మెగాస్టార్ చిరంజీవి.

 

Chiranjeevi

Chiranjeevi

ట్రేడ్ వర్గాల వారి సమాచారం ప్రకారం ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రా : రూ. 54 కోట్లు, నైజాం : రూ. 36 కోట్లు, సీడెడ్ : రూ. 27 కోట్లతో క్లోజ్ అయినట్టు టాలీవుడ్ సమాచారం. ఆంధ్రా, నైజాం, సీడెడ్ కలిపి వచ్చిన దాదాపు 120 కోట్లతో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్ 28 కోట్లు, ఓవర్సీస్ బిజినెస్ 11 కోట్లకు జరిగిపోయింది.