వీళ్లతో సినిమాలు చేస్తున్నా.. కన్ఫామ్ చేసిన చిరు..
మెగాస్టార్ చిరంజీవి త్వరలో యువ దర్శకులతో కలిసి పని చేయబోతున్నట్టు తెలిపారు..
మెగాస్టార్ చిరంజీవి త్వరలో యువ దర్శకులతో కలిసి పని చేయబోతున్నట్టు తెలిపారు..
మెగాస్టార్ చిరంజీవి తాజాగా మీడియా వారితో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. కరోనా విపత్తు నిధికి ఎందరో ముందుకు వచ్చి తమ సాయాన్ని అందిస్తుండడం సంతోషంగా ఉందని, ఎంత కష్టమైనా సరే, ఈ లాక్డౌన్ పూర్తిగా ముగిసే వరకు సినీ కార్మికులకు నిత్యావసరాలు అందిస్తూనే ఉంటాం, ఇటువంటి విపత్కర సమయంలో వారిని ఆదుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపిన మెగాస్టార్ తన కొత్త చిత్రాల గురించి కూడా మాట్లాడారు.
ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవిని మీ కొత్త చిత్రాలన్నీ యువ దర్శకులతోనే ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి అని అడిగ్గా..
“సాహో సుజీత్తో లూసిఫర్ రీమేక్ చేసే ఆలోచన ఉంది. బాబీ డైరెక్టర్గా ఒక సినిమా, మెహర్ రమేష్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను.
రీసెంట్గా హరీష్ శంకర్, సుకుమార్, పరశురామ్ లాంటి యువదర్శకులను మా ఇంట్లోనే కలవడం, డిస్కస్ చేసుకోవడం జరిగింది. కొరటాల శివ గారి సినిమా పూర్తయ్యాక నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ గురించి చెప్తాను. యంగ్ డైరెక్టర్స్తో పని చేస్తే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు. అలాగే నన్ను స్క్రీన్ మీద చూస్తూ పెరిగి డైరెక్టర్స్ అయిన యంగ్ జనరేషన్కి నన్ను కొత్తగా ప్రజెంట్ చేయాలన్న తపన ఉంటుంది. నాకు కూడా వాళ్ళతో, వాళ్ళ న్యూ థాట్స్తో వర్క్ చేయడం ఇన్స్పైరింగ్గా ఉంటుంది” అని చెప్పారు చిరు.