చిరు సందేశం: చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. ముఖానికి మాస్క్ ధరించండి..
‘చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. ముఖానికి మాస్క్ ధరించడం ఎంతో అవసరం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.
కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవితో పాటు యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బ నటించింది.
‘మాస్క్ను తప్పనిసరిగా ధరించండి.. వీలైనన్నిసార్లు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోండి.. సాంఘిక దూరాన్ని పాటించండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.. అలాగే మీ కుటుంబాన్ని ఈ దేశాన్ని కూడా కాపాడండి’.. అంటూ చిరు పిలుపునిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Thank you @ActorKartikeya @YoursEesha #chaitanbharadwaj ఆలోచన పంచుకోగానే ముందుకొచ్చిన మీకు నా ధన్యవాదాలు. I truly appreciate your commitment to the society. #SVVishweshwar #ShivramApte #Pappu #Babji pic.twitter.com/k6zyniBfc1
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2020