PV Sindhu : మెగాస్టార్ ఇంట్లో పీవీ సింధు, ఘనంగా సత్కారం

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా...పీవీ సింధును ఘనంగా సత్కరించారు.

PV Sindhu : మెగాస్టార్ ఇంట్లో పీవీ సింధు, ఘనంగా సత్కారం

Pv Sindhu

Chiranjeevi And PV Sindhu : టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా…పీవీ సింధును ఘనంగా సత్కరించారు. కుటుంబసభ్యులు, ఆత్మీయుల మధ్య ఈ సత్కార కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు నాగార్జునతో పాటు సీనియర్ నటీమణులు రాధిక, సుహాసినితో సహా చిరు కుటుంబసభ్యులు, ఆత్మీయులు, పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని సింధును అభినందించారు. సింధు సాధించిన కాంస్య పతకంతో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతూ..సందడిగా గడిపారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Read More : PV Sindhu : పూల చీర‌లో మెరిసిపోతున్న‌ సింధు

రెండుసార్లు ఒలింపిక్స్ లో పతకాలు సాధించారు పీవీ సింధు. ఈ సారి టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించారు సింధు. ఈ సందర్భంగా సత్కరించాలని భావించిన చిరంజీవి…ఇంటికి రావాల్సిందిగా సింధును ఆహ్వానించారు. 2021, ఆగస్టు 28వ తేదీ శనివారం సాయంత్రం చిరంజీవి ఇంటికి చేరుకున్న సింధుకు చిరు కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని బహుకరించిన చిరు శాలువాతో సత్కరించి..ఆశీర్వదించారు.

Read More : Chiranjeevi : టాలీవుడ్ పెద్దన్నయ్య చిరంజీవి..

ఈ సందర్భంగా చిరు..సింధు సాధించిన విజయాలను కొనియాడారు. సింధును చూసి దేశం మురిసిపోతుంటే..తన బిడ్డే అనే భావన కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం సింధు మాట్లాడుతూ…తనపై చిరు ఫ్యామిలీ చూపించిన ప్రేమ, గౌరవం ఎప్పటికీ గుర్తుంచుకుంటానని..వచ్చే ఒలింపిక్స్ లో తప్పకుండా బంగారం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేశారామె. ఈ వేడుకకు హాజరైన వారు సింధును సన్మానించారు.

 

View this post on Instagram

 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)