‘అర్జున్ సురవరం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ : చీఫ్ గెస్ట్‌గా చిరు

‘అర్జున్ సురవరం’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు..

  • Published By: sekhar ,Published On : November 23, 2019 / 11:17 AM IST
‘అర్జున్ సురవరం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ : చీఫ్ గెస్ట్‌గా చిరు

‘అర్జున్ సురవరం’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు..

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా.. టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా.. ‘అర్జున్ సురవరం’.. ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ సినిమా విడుదల అనేకసార్లు వాయిదా పడీ పడీ.. ఎట్టకేలకు రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇటీవల ‘అర్జున్ సురవరం’ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి స్పందన వస్తోంది.

 ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నవంబర్ 26 న, హైదరాబాద్, నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ‘అర్జున్ సురవరం’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. నిఖిల్, నిర్మాత రాజ్ కుమార్ ఆకెళ్ల మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆహ్వానించారు. చిరు మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Read Also : పాతికేళ్ల తర్వాత ‘బాషా’ ఈజ్ బ్యాక్

నవంబర్ 29న ‘అర్జున్ సురవరం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.. పోసాని, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం : శ్యామ్ సిఎస్, కెమెరా : సూర్య, ఎడిటింగ్ : నవీన్ నూలి, సమర్పణ : బి మధు, నిర్మాత : రాజ్ కుమార్ ఆకెళ్ల.