Tollywood Mega Meeting: సీఎం జగన్ ఇచ్చిన భరోసాతో రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తాం – చిరంజీవి

జనవరిలో ఒకసారి సీఎం జగన్ తో భేటీ అయిన చిరంజీవి ఈరోజు మరోసారి సీఎంతో భేటీ అయి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. మీటింగ్ అనంతరం ఆయన ట్విట్టర్ లో పోస్టు చేస్తూ..

Tollywood Mega Meeting: సీఎం జగన్ ఇచ్చిన భరోసాతో రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తాం – చిరంజీవి

Mega Meeting

Tollywood Mega Meeting: కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ప్రధాన సమస్యలలో మొదటిది ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు.. థియేటర్ల మీద అధికారుల దాడులు. ఈ సమస్యకు పరిష్కారం కోసం సినిమా పెద్దలు కొందరు ఎన్నోసార్లు ప్రయత్నించగా.. ఏపీ ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి సమస్యలను తెలుసుకొనే ప్రయత్నం చేసింది. జనవరిలో ఒకసారి సీఎం జగన్ తో భేటీ అయిన చిరంజీవి ఈరోజు మరోసారి సీఎంతో భేటీ అయి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

మీటింగ్ అనంతరం ఆయన ట్విట్టర్ లో పోస్టు చేస్తూ.. ‘తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ అన్ని కోణాల్లో అర్థం చేసుకుని, పూర్తి అవగాహనతో, ఎంతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి, సమస్యలపై ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవడమే కాక, తెలుగు చిత్ర పరిశ్రమకు భవిష్యత్ కార్యక్రమాన్ని సూచిస్తూ, పరిశ్రమకి అన్ని రకాలుగా అండగా వుంటానని భరోసా ఇస్తూ ఎంతో సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి పరిశ్రమలోని ప్రతి ఒక్కరి తరపున మరో మారు కృతజ్ఞతలు’

‘త్వరలోనే అధికారికంగా పరిశ్రమకి శుభవార్త అందుతుందని ఆశిస్తున్నాను’

Read Also: పేటీఎంలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేయండిలా..

‘మీరు ఇచ్చిన భరోసాతో,మీరు చేసిన దిశానిర్దేశం తో తెలుగు పరిశ్రమ రెట్టింపు ఉత్సాహం తో ముందుకెళుతుందన్న నమ్మకంతో హృదయ పూర్వక ఆనందాన్ని తెలియచేస్తూ థాంక్ యూ సార్ వైఎస్ జగన్ గారు’ అంటూ ట్వీట్ చేశారు.

చిరంజీవితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక దిగ్గజం రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, ఆర్ నారాయణ మూర్తి, అలీ, పోసాని కృష్ణ మురళి తదితరులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆహ్వానాలు అందిన వారిలో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు.